మాఘ పురాణం 18

మాఘమాసం 18వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 18వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో శ్రీమన్నారాయణుడు చేపినట్టుగానే దేవతలు ఇంద్రుడిని శాపవిముక్తిని కలిగించటానికి ప్రయాగ వెళ్లరు. అక్కడ గంగానది తెల్లగాను, యమునా నది నల్లగా ఉంటుంది. అక్కడ విశాలమైన వటవృక్షం ఉంది. సర్వ తీర్ధాలకి రాజైనటువంటిది ప్రాయంగా తీర్ధం. మాఘమాసంలో త్రివేణీసంగమంలో స్నానం చేయటం వలన పన్నెండు నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. దేవతలు త్రివేణి సంగమంలో నీటిని తీసుకొని పద్మగిరి ప్రాంతములో ఇంద్రుడి కోసం వెతుకుతున్నా దేవతలకు చిన్న పాదములు పెద్దశరీరం కలిగిన విచిత్రమైన తొండ  కనిపించింది. ఆ తొండ దేవతలను చూసి భయపడి ధ్వని చేసింది. దేవతలు ఆ దొండను చూసి అది రక్షస్వరూపము అనుకోని దానిని తాడుతో బంధించారు. దేవతల స్పర్శ తగలగానే  తొండ రూపాని వదిలి అందమైన స్త్రీ రూపాని ధరించింది. ఆమె దేవతలను చూచి నమస్కరించింది. దేవతలు ఆమెను ఆశ్చర్య పోయారు. ఎవరు నువ్వు తొండ రూపాని ఎలా పొందావు. నీ కథను వివరించు అని అడిగారు. ఆమె దేవతలకు మళ్ళీ నమస్కరించి నా పేరు సుశీల. కాశ్మీరంలో ఒక బ్రాహ్మణా కుటుంబంలో జన్మిచాను. నా తండ్రి నాకు వివాహం చేసారు. నా దురదృష్టం నా వివాహం జరిగిన నాలుగోవ రోజు నా భర్త మరణించారు. నా తల్లిదండ్రులు చాల ఎక్కువ దుఃఖించారు. నన్ను బంధువులకు అప్పగించి నా తల్లితండ్రులు వనవాసానికి తపస్సు చేసుకోవటానికి వెళ్లిపోయారు. బంధువులు నన్ను పాటించుకోకుండా నిరాదరణ చేసారు. నేను బిక్షాటన చేసి జీవించాను. నాకు వ్రతం చేయాలనీ గాని, స్నానం చేయాలనీ గాని, దానం చేయాలనీ గాని నాకు ఎవరు చెప్పలేదు. దుష్టురాలిగా జీవించాను. ఒకసారి అనుకోకుండా ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టి తరువాత నేను తిన్నాను. కొన్నాళ్లకి మరణించాను. నరకానికి వెళ్లాను. అక్కడా శిక్షలు అనుభవించాను. రకరకాల జంతు జన్మలు ఎత్తాను. నేను చేసిన ఒకే ఒక పుణ్యం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాను. దానివల్లనే దర్శన భాగ్యం కలిగి నాకు శాపవిముక్తి కలిగింది. నామీద దయవుంచి నాకు ఉత్తమగతులు కలగటానికి మార్గాన్ని తెలియజేయండి. వారు ప్రయాగ నుంచి తీసుకువచ్చిన త్రివేణి సంగమం నీరు చాలాగానే ఆమె దైవత్వం కలిగి ఉత్తమగతులకి వెళ్లిపోయింది. దేవతలు ఇంద్రుడిని వెతుకుంటూ వెళ్లరు. వికార పూపములో తిరుగుతున్న ఇంద్రుడిని చూసి బాధపడరు. ఇంద్రుడి దగరకు వెళ్లి శ్రీమన్నారాయణుడు నీ శాప విముక్తికి మార్గాన్ని తెలియజేసారు అని చెప్పారు. ఇంద్రుడిని తీసుకొని తుంగభద్ర నదీతీరంలో త్రివేణి సంగమంనుంచి తెచ్చిన నీటిని అతని పై పోసి తరువాత తుంగ భద్రలో స్నానం ఆచరించగానే ఇంద్రుడికి శాపవిముక్తి కలిగి మాములు రూపం వచ్చింది. ఇంద్రుడు దేవతలను తీసుకొని దేవలోకానికి వెళ్లిపోయారు. జహ్నుమహాముని ఇంకో కధచెపుతాను విను అని గృతజ్ఞ మహర్షి చెప్పసాగారు. పూర్వ కాలంలో పంపానది తీరములో ధనవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దానం సంపాదించటమే గాని ధన ధర్మాలకు ఎపుడు వినియోగించేవారు కాదు. దైవ ప్రార్ధన కానీ చేయలేదు. అతను కొంతకాలానికి మరణించాడు. నరకానికి వెళ్లి అక్కడ శిక్షలను అనుభవించాడు. మళ్ళీ మానవరూపములో దరిద్రుడై జన్మించి కష్టాలు అనుభవించి మరణించాడు. మరుజన్మలో పిశాచమై పంపా నది తీరములో మరిచెట్టుపై నివసించసాగాడు. ఒక సారి ఆ మరిచెట్టు దగరకు శిష్యులతో కలిసి అక్కడకు వచ్చారు. వశిష్ఠులవారు మాఘస్నానం ఆచరించి ఆ చెట్టు నీడనే కూర్చొని శ్రీమన్నారాయణుడిని ఆరాధించి పురాణం ప్రవచనం వింటున్నాడు. మరిచెట్టు పైన ఉన్న పిశాచరూపములో ఉన్న వైశ్యుడు కూడా వింటున్నాడు. అతను మరిచెట్టు మీదనుంచి కిందపడ్డాడు. తన నిజరూపాన్ని ధరించాడు. వసిష్ఠులవారికి నమస్కరించి తన వృత్తంతం అంత వివరించాడు. విశిష్ఠులవారు అతని పైన గంగా జలాన్ని చల్లారు. అతనిని దివ్య రూపం వచ్చి అతను ఉత్తమ గతులకి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 18వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...