మాఘ పురాణం 27

మాఘ పురాణం  27 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 27వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వ తి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో ధీరుడు, ఉపధీరుడు అనే పండితులు మాఘమాసంలో చంప నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి శ్రీహరి మహిమలను పారాయణం చేయాలని అక్కడికి వచ్చారు. ఇద్దరు చంప నదిలో స్నానం చేసి అక్కడే ఉన్న రవి చెట్టు నీడలో శ్రీహరిని పూజించి తరువాత మాఘమాస వ్రత మహిమను, శ్రీహరి మహిమలను చెప్పుకున్నారు. ఆ రవి చెట్టు తొర్రలో రెండు పాములు నివసిస్తున్నాయి. అవి కూడా శ్రీహరి మహిమలను విని తరించాయి. ఆ పాములు తోరనుంచి బయటకు వచ్చాయి. వాటిని చుసిన ధీరుడు, ఉపధీరుడు భయపడిపోయారు. అవి బయటకు వచ్చిన కొంత సేపటికి వాటికీ పాము రూపాలు పోయి దివ్యమైన శరీరాలు వచ్చాయి. అది చుసిన ధీరుడు ఉపధీరుడు కొంత ధైర్యం తెచ్చుకొని మీరు ఎవరు అని ప్రశ్నించారు. దానికి వారు ఆ పండితులకి నమస్కరించి మేము ముందు జన్మలో భార్య భర్తలం. మా పేర్లు క్రూర, క్రూరుడు. మాకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు జ్ఞాని. అతనికి యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహం చేసాము. మా కోడలు అణకువ, మంచితనానికి మారుపేరు. మేము అహంకారంతో ఆమెను రోజు హింసించేవాళం, రోజు కోటే వాళ్లము. ఏనాటికైనా మాలో మార్పు వస్తుంది అని సహనంతో భరించేది. ఒక రోజు మా కుమారుడు జ్ఞాని మాతో అమ్మ నాన్న మీకు కోడలు అనే అందుకు అంత కోపం. ఆమె మీరు చేపినతే చేస్తుంది కదా. ఆమెను కొట్టకుండా ప్రేమగా చూసుకోవచ్చుకదా. ప్రేమగా కాకపోయినా కనీసం మనిషిగా గుర్తించవచ్చు కదా. మా పైన దయ ఉంచి మమల్ని శుభ్రంగా చూసుకోండి. మీ కోపాన్ని తగించుకోండి అని చెప్పాడు. మేము ఆ మాటలకూ కోపం తెచ్చుకొని నువ్వు మాకే నీతి పాఠాలు చెపుతావా. నీ భార్య నీకు చేపి పంపించిందా. మేము పెద్దవాలం మేము ఏమైనా చేస్తాము నువ్వు మాకు చెపుతావా అని మా కోడలిని, కొడుకుని ఇష్టం వచ్చినట్టు మా కోపం తీరేవరకు కొటాము. మా కుమారుడికి మాపై కోపం వచ్చిన తల్లితండ్రులను గౌరవించాలి అని సహించాడు. మేము అంతటితో ఆగక మా కోడలిని తీసుకెళ్లి గదిలో బందించాము. నా కొడుకు మా కాళ్ళు పట్టుకొని ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చుట్టూ పకాలవాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎంతచెపీనా మేము వినలేదు. పైగా ఇది మా కుటుంబవిషయం మీరు కల్పించుకోవద్దు అని వారిని పంపేసాము. ఏడూ రోజులు ఆమె అన్న నీరు లేక ఆ గదిలోనే మరణించింది. ఎనిమిదొవరోజు మేము లేని సమయం చూసి మా కుమారుడు ఆ గది తలుపు తెరచి మా కోడలిని చూసాడు.  నా కోడలు మరణించి ఉండటం చూసి నా కుమారుడు తతుకోలేక నిశ్చేతుడై పడిపోయాడు. కొంతసేపటికి నేను వచ్చి చూసి గది తలుపులు ఎవరు తెరిచారు అని గదిలోకి వెళ్లి చూసాను. అక్కడ నా కోడలి మరణం, నా కుమారుడు నిశ్చేస్తుడై పడిపోవటం చూసి నేను చేసిన తప్పు తెలుసా వచ్చింది. గుండెలు బాదుకుంటూ ఏడిచాను. నా ఏడుపు విని చుట్టుపక్కలవాలు వచ్చి చూసారు. కొంతసేపటికి బంధువులు స్నేహితులు వచ్చారు. అందరూ నన్ను, నా భర్తని తిటగలిగినవాలు తిట్టారు. కొంతమంది మమ్మలిని కొట్టారు. కొంతకాలం తరువాత నా కుమారుడు ఇల్లు వదిలి గంగా తీరానికి వెళిపోయాడు. తన భార్య మరణానికి తనుకూడా ఒక కారణం అని తన భార్యను కాపాడుకోలేక పోయాను అని కుమిలిపోయి విచారించి మనోవేధనతో మరణించాడు. కొంతకాలం తరువాత మేము కూడా మరణించాము. యమా భటులు మమ్మలిని తీసుకువెళతానికి వచ్చారు. వారు మమ్మలిని కొట్టుకుంటూ తీసుకువెళ్లి ఆశిపత్రం అనే నరకంలో మమ్మలిని ఉంచారు. ఆశిపత్రం అంటే ఒక పంజరంలో లోపలి సూదులు లాంటి ముళ్ళు ఉండి మధ్యలో మమ్మలిని ఉంచారు. అవి గుచ్చుకొని మేము చాల కాలం నరకం అనుభవించాము. తరువాత ఈ రావిచెట్టు తొర్రలో మేము పాములుగా జన్మించాము. ఈ రోజు మీరు పారాయణం చేసిన శ్రీహరి మహిమల వలన మాకు పాపా విముక్తి కలిగి పూర్వజన్మ స్మృతి వచ్చింది అని చెప్పారు. ధీరుడు ఉపధీరుడు మాఘమాసం వ్రత మహత్యం శ్రీహరి మహిమలను తలుచుకుంటూ సంతోషంగా అక్కడినుంచి వెళ్లిపోయారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 27వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...