మాఘ పురాణం 15

మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. ఓ మహర్షి అ పండితుడికి దర్శనం ఇచ్చిన శ్రీమన్నారాయణుడు నీవు కోరిన పుత్రుడిని ప్రసాదించాను కదా మళ్ళి దేని కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగారు. అందుకు అ పండితుడు స్వామి మీరు వరం ఏచిన్నటే నాకు ఒక కుమారుడు జన్మించారు. అతనికి జతకకర్మలు చేస్తున్నపుడు నారద మహర్షులవారు వచ్చి మా కుమారుడిని చూసి ఇతని పన్నెండు సంవత్సరములు మాత్రమే జీవిస్తారు అని చేపి వెళ్లిపోయారు. స్వామి మీరు ఇచ్చిన వరం ఎందుకు ఇలా వ్యర్థం అయింది మేము ఏమి పొరపాటు చేసాము అని అడుగుతారు. అందుకు శ్రీమన్నారాయణుడు ఓ పండితుడా! నీవు గతజన్మలో జ్ఞానశర్మ అనే పేరు గల పండితుడివి. ఆ జన్మలో కూడా నా భక్తుడివి. ఇప్పటి నీ భార్య గతజన్మలో కూడా మీరు భార్యాభర్తలు. మీరు గత జన్మలో కూడా మాఘ మాసం వ్రతం చేసారు. కానీ నీ భార్య మాఘ పూర్ణమ వ్రతం చేసింది కానీ ఆమె చేసిన పాయసాన్ని బ్రాహ్మణులకి పెట్టటం మరచిపోయింది. ఆ దోషం వలన మీకు సంతానం కలగలేదు. నా అనుగ్రహం వలన మీకు సంతానం కలిగింది కానీ మీ కుమారుడు పన్నెండు సంవత్సరాల ఆయుర్ధాయమే వచ్చింది. ఈ దోషం పోవటానికి మీరు మాఘమాసం వ్రతం చేయండి మీ కుమారుడు పూర్ణాయుష్కుడు అవుతాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే గంగా నదిలో స్నానమాచరించి నన్ను పూజించి గంగా జలాన్ని నీ కుమారుడిపై చళ్ళు రోజు నీ కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయుష్కుడు అవుతాడు అని చేపి శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయ్యారు. ఆ పండితుడు సంతోషించి ఇంటికి వచ్చి జరిగిన విషయం చేపి మాఘమాసం అంత సూర్యదయానికి ముందే గంగా నదిలో కుటుంబమంతా స్నానం ఆచరించి శ్రీమన్నారాయణుడిని పూజించినా గంగా జలాన్ని తన కుమారుడిపైన చల్లారు. ఈ విధముగా నెలరోజులు చేసారు. కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయుష్కుడు అయ్యాడు. అతను సకల వేద శాస్త్రములను సకల విద్యలను నేర్చుకున్నాడు. అందరి పట్ల వినయంగా విధేయతగా మెలిగేవారు.మాఘమాసం అతి రహస్యం అయింది. అంతగాక మాఘమాస మహిమ కేవలం బ్రహ్మకి విష్ణుమూర్తికి శివునికి సప్తఋషులకి మాత్రమే తెలుసు. పూర్వజన్మ పుణ్యం ఉంటేగాని ఈ మాఘమాస వ్రతం తెలియదు. మాఘమాసం వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చి మానవులు, యక్షులు, కీనేరాలు, కింపురుషులు, రాక్షసులు ఎవరైనా చరించవచ్చు అని చెప్పారు. అంతే కాక ఈ రోజు మాఘ పూర్ణమ అత్యంత పవిత్రమైనది. సంవత్సరములో నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానం చేయాలనీ చెప్పారు. అవి కార్తీక పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. మాఘపూర్ణిమ రోజు సముద్రానికి వెళ్లి సముద్రలో శ్రీహరికి ధ్యానం చేస్తూ స్నానం ఆచరించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. మాఘపూర్ణిమ నాడు సముద్ర స్నానం ఆచరించటం వలన సకల పాపములు పోయి పుణ్యం కలుగుతుంది అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం పదిహేనోవా రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...