మాఘ పురాణం 23

మాఘమాసం 23వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 23వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో భూలోకానికి పారిజాత పువ్వులను తీసుకురావటానికి వెళ్లిన గుహ్యకుడు తిరిగి రాకపోవటంతో ఇంద్రుడు విచారించారు. ఇంకా ఇంద్రుడే స్వయముగా దేవతలతో కలిసి పారిజాత వనానికి వచ్చారు. ఆ వనం అందాన్ని చూసి మైమరచిపోయి విష్ణువుకి పుజించి తీసిన నిర్మాల్యని చూసుకోకుండా తొక్కుకుంటూ లోపలి వెళ్లరు. వెంటనే దేవతలందరికీ దివ్య శక్తులు, ఆకాశ గమన శక్తీ పోయింది. దేవతలు అది గుర్తించాలేదు. ఇంద్రుడు పువ్వులను కోసుకుంటుండగా మిగిలిన దేవతలు వచ్చి పువ్వులు ఎందుకు కోయటం పారిజాత వృక్షాన్ని తీసుకువెళదాము అనుకున్నారు. వారి శక్తిని అంత ఉపయోగించి వృక్షాన్ని పెకలించిపోయారు. కానీ అది కొంచం కూడా కదలలేదు. అప్పుడు జరిగిన పొరపాటును గుర్తించి బాధపడ్డారు. తెల్లవారిన తరువాత సత్యజిత్తు పువ్వులను కోసుకుంటాని వచ్చారు. అక్కడ ఉన్న ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్య పోయారు. ఇంద్రుడితో మీరు దేవుని మేము ఏమి చేయలేమని ఎలా పూవులను దొంగిలిస్తారా అని అడుగుతారు. దేవతలు ఏమి సమాధానం చెప్పలేక ఊరుకున్నారు. సత్యజిత్తుకి కొంతసేపటికి తనవల్లనే దేవతలు ఇక్కడ ఉండిపోయారు అని వారికీ ఆహారము లేకుండా అయిపోయింది అని బాధపడ్డారు. అతను అతని భార్య కూడా ఆహారం తీసుకోకుండా శ్రీమహా విష్ణువుని ప్రార్ధించారు. ఎలా పదకొండురోజుల గడిచింది. శ్రీమహా విష్ణువు వారి ప్రార్ధనను మానించి ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు సత్యజిత్తు స్వామి నా వలన ఇంద్రాది దేవతలు భాదపడుతున్నారు వారికీ విముక్తిని ప్రసాదించింది అని వేడుకొన్నారు. అపుడు శ్రీమహావిష్ణువు సత్యజిత్తు ప్రార్ధనను మానించి దేవతలతో దేవతలారా! క్షారసాగర మధనం జరుగుతున్నపుడు అమృతం వచ్చింది కదా. ఆ అమృతపు రెండు భిందువులు భూమిపైపడి తులసి మొక్కగా, పారిజాత వృక్షంగా మారాయి. వాటిని ఇతను ఎంతో జాగ్రత్తగా పెంచి రోజు నా పూజకు తీసుకువచ్చి నన్ను పూజించసాగారు. అటువంటి పువ్వులను అతనికి చెప్పకుండా కోయటం తప్పు కదా అని అన్నారు. దేవతలు తమ తప్పులను ఒప్పుకొని శ్రీమహావిష్ణువుని క్షమించమని కోరుకున్నారు. అపుడు శ్రీమహావిష్ణువు దేవతలారా! మీరు సత్యజిత్తు అతని కుటుంబం ఈ పదకొండు రోజులు ఆహారం తీసుకోకుండా నన్నే ప్రార్ధించారు. అందులోనూ ఏది మాఘమాసం పదకొండోవరోజు ఏకాదశి అవటం చేత మీకు ఈ దివ్య శక్తులను ప్రసాదిస్తున్నాను. ఈ సత్యజిత్తుకి అతని కుటుంబానికి వైకుంఠ సాన్నిధ్యాని అనుగ్రహిస్తునాను అని చేపి శ్రీ మహా విష్ణువు అంతర్ధానమయ్యారు. దేవతలకు వారి దివ్య శక్తులు వచ్చి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయారు. సత్యజిత్తు తన మిగిలిన జీవితాన్ని అరిమహావిష్ణువు సేవలో గడిపి తదనంతరం వైకుంటానికి వెళ్లారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 23వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...