మాఘ పురాణం 22

మాఘమాసం 22వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 22వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో మాఘమాసా వ్రతం, ద్వాదశి వ్రతం చేసిన వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. చివరికి మోక్షం, విష్ణు సాన్నిధ్యం పొందుతారు. పూర్వం దేవదానవులు మీరు పర్వతాన్ని క్షిర సాగరంలో కవంలా వేసి ఆదిశేషుడిని మీరు పర్వతానికి చేతి దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకొని చిలకసాగారు. చిలుకుతుండగా మీరు పర్వతం క్షిర సాగరం లోపలి పడిపోయింది. అపుడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి తన మూపుమీద మీరు పర్వతాన్ని మునిగిపోకుండా నిలబెట్టుకున్నారు. అప్పుడు దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకొని చిలకసాగారు. అలా చిలకగా కొంత సేపటికి అందులోనుంచి కాలకూటవిషం వచ్చింది. ఆ విషవాయువులు తట్టుకోలేక దేవదానవులు హాహాకారాలు చేసారు. అందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్ధించారు. అపుడు పరమేశ్వరుడు ఆ కాలకూటవిషాన్ని తీసుకొని తాగేశారు. పార్వతి మాత ఆ విషాన్ని శివుని గర్భంలోకి వెళ్లకుండా కంఠం దగ్గరే ఆపేసింది. దేవదానవులు మళ్ళి మంధర పర్వతాన్ని చిలకటం మొదలు పెట్టారు. ఈ సారిఅందులోనుంచి అప్సరసలు, ఐరావతం, ఉచైస్రావం, పారిజాతవృక్షం మొదలైన సంపదలు ఎన్నో వచ్చాయి. వాటన్నిటి తరువాత శ్రీ మహా లక్ష్మి వచ్చింది. ఆమెని శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్నారు. తరువాత అమృత కలశం తీసుకొని ధన్వంతరి వచ్చారు. అమృతం రాగానే దేవతలు దానవులు వాదన చేసుకోసాగారు. వారి కొడవను తీర్చటానికి శ్రీ మహా విష్ణువు మళ్ళి మోహిని అవతారాన్ని ధరించి వారి ముందుకు వచ్చారు. దేవదానవులు ఆమె సౌందర్యానికి మోహము చెంది ఆమె దగరకు వచ్చారు. మోహిని వారి చేతినుండి అమృత కలశాన్ని తీసుకొంది. దేవతలను ఒకవైపు దానవులను ఒకవైపు కుర్చోపెటింది. దేవతలకు అమృతాన్ని దానవులకు సురను వారికీ అనుమానం రాకుండా పంచసాగింది. అమృతాన్ని తగిన దేవతలు తేజస్సుతో వెలిగిపోతున్నారు. సురను తగిన దానవులు కళావిహీనంగా తయారవుతున్నారు. దీనిని గమనించిన ఒక రాక్షసుడు దేవతగా మరి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని సేవిస్తారు. దీనిని సూర్య చంద్రులు గమనించి మొహినికి సైగచేస్తారు. మోహిని వారిని తన సుదర్శన చక్రంతో కంఠాన్ని ఛేదిస్తుంది. అప్పటికే అమృతం కంఠం లోకి వెళతాం వలన తల మొండెం వేరు అయినా జీవించేవుంటారు. వెళ్లి మోహిని పాదాలపై పది రాక్షసత్వని వదిలేస్తామని ఇకనుంచి దేవతలుగా జీవిస్తామని వేడుకుంటారు. మోహిని వారి ప్రార్ధనను మనించి వారికీ దేవతలలోను, నవగ్రహాలలోను స్థానం కల్పిస్తుంది. అప్పటి నుండి వారు ఒకరుగా కాకా ఇద్దరుగా మరి రాహు కేతువులుగా పేరుగాంచుతారు. మోహిని మిగిలిన అమృతాన్ని దేవతలకు ఇస్తుంది. దేవతలు అమృతాన్ని తీసుకొని స్వర్గానికి వెళతారు. బ్రహ్మ విషు మహేశ్వరులు తమ తమ లోకాలకి వెళ్లిపోయారు. కానీ ఆ సముద్రపు వాడునా రెండు అమృతపు బిందువులు పడ్డాయి. ఒక అమృతపు బిందువేమో పారిజాత వృక్షం అయింది. ఇంకొక అమృతపు బిందువేమో తులసి మొక్క అయింది. కొంతకాలం గడిచిన తరువాత సత్యజితుడు అనే ఒకతను ఆ మొక్కలకు నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచసాగారు. అది అందమైన పుల్ల వనంగా మారింది. పారిజాత పువ్వులు, తులసీదళములు తీసుకొని రోజు వాటిని దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో ఇవ్వసాగారు. ఒక సారి ఇంద్రుడు ఆ వనం మీదుగా ఆకాశ గమనంలో వెళుతూ ఈ వనాన్ని చూసారు. వెంటనే కొన్ని పారిజాత పువ్వుల్ని కోసుకొని తీసుకువెళ్లి తన భార్య ఐన శచి దేవికి తీసుకెళ్లి ఇచ్చారు. శచి దేవి ఆ పువ్వులను చూసి ఇష్టపడి రోజు కావాలని అడిగింది. అప్పుడు ఇంద్రుడు గుహ్యకుడు అనే యక్షుడిని పంపి రోజు ఆ పువ్వుల్ని తెపించుకునేవారు. పువ్వులు రోజు మాయం అయే సరికి సత్యజితుడికి అనుమానం వస్తుంది. ఈ పువ్వులను తీసుకువెళుతున దొంగను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతను దొరకడు. చివరికి రోజు తాను పువ్వులు ఇస్తున్న దేవాలయంలో స్వామి కైంకర్యాలు అయినా తరువాత తీసేసిన పువ్వులను తీసుకువచ్చి ఆ వనం చుట్టూ చల్లారు. గుహ్యకుడు అదృశ్య రూపములో ఆ వనం లోపలికి రావటానికి ఆ పువ్వులను దాటారు. ఆ పాపం వలన అతని దివ్య శక్తులు పోయి కనిపించారు. అంటే కాకుండా అతని ఆకాశ గమన శక్తిని కూడా పోగొట్టుకున్నారు. సత్యజిత్తు గుహ్యకుడుని పట్టుకున్నారు. ఈ పువ్వులు ఎందుకు దొంగిలిస్తున్నావు అని అడిగారు. అప్పుడు గుహ్యంగుడు వీటిని ఇంద్రుడు తీసుకురమన్నారు అని చెపుతాడు. గుహ్యకుడు అక్కడే మూడు రోజులు బందీగా ఉన్నారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 22వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...