మాఘ పురాణం 25

మాఘమాసం 25వ రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 25వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో పూర్వం కళింగ దేశమునా కిరాతకుడు ఒకడు ఉండేవాడు. అతడు అడవి ప్రాంతములో గొప్ప సంపద, పరివారం కలవాడు. పవివరంతో ఒకరోజు వేటకోసం వెళ్లి అనేక మృగాలను వేటాడి తిరుగుతుండగా ఒక బ్రాహ్మణుడిని చూసాడు. ఆ బ్రాహ్మణుడు నర్మద నది స్నానం చేయటానికి బయలుదేరారు. ఆ మార్గంలో అలసటతో ఒక మరిచెట్టు నీడలో కూర్చున్నారు. ఆ కిరాతకుడు అతనిని చూసి అతని వద్ద ఉన్న ధనాన్ని ఇవ్వమని బెదిరించాడు. ఆ బ్రాహ్మణుడు నా దగ్గర ధనం లేదు నేను పేదవాడిని అని చెప్పారు. అతని దగ్గర ఏమి లేకపోవటంతో ఆ బ్రాహ్మణుడిని కిరాతకుడు చంపేశాడు. అందువలన అతనికి బ్రహ్మహత్య పాపం వచ్చింది. అతడు అలాగే ఆ దారిన వచ్చిన వారిని బెదిరించి ధన్నాన్ని దొంగిలించేవాడు. అతనికి ఒక బంగారు నగలను తాయారు చేసే ఒక మిత్రుడు ఉండేవాడు. అతనుకూడా కిరాతుడిలాగే క్రూరుడు. అతని దగ్గరకు నగలను చేయమని వచ్చేవారి దగ్గర బంగారాన్ని దొంగిలించేవాడు. వీరికి ఇంకొక మిత్రుడు ఉన్నాడు. అతడు కాముకుడు. స్త్రీలను చుస్తే వదిలిపెట్టేవాడు కాదు. అతనికి అతని తండ్రి చిన్ననాడే చనిపోయాడు. అతని తల్లి కూడా స్వచ్ఛ విహారిణి అయి తిరుగుతుండేది. ఒక నాటి రాత్రి ఆమె తన ప్రియుడిని కలవటానికి అర్ధరాత్రి పుట ఒక ప్రదేశానికి వేలింది. అక్కడికి ఆమె కొడుకు కూడా తన ప్రియురాలిని కలివాటానికి వేలాడు. చీకటిలో ఒకరికి ఒకరు కనబడకా వచ్చిన వారే తమ ప్రియులని అనుకోని తెల్లరేవరకు గడిపారు. వెలుతురు వచ్చిన తరువాత వారు ఒకరికి ఒకరు చూసుకొని కంగారు పడ్డారు. అతని తల్లి ఆమె చేసిన పనికి తట్టుకోలేక మరణించింది. ఆమె నరకానికి వెళ్లి అనేక శిక్షలు అనుభవించింది. అతను తాను చేసిన పనికి సిగ్గుపడకుండా మామూలుగానే తిరగసాగాడు. వీరి ముగ్గురికి ఒక బ్రాహ్మణా స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు విశ్రుంఖలుడు. అతను కూడా పూజలు మానేసి వీరితోపాటు తిరుగుతూ విరిలాగానే తయారయ్యాడు. ఒక సారి ఆ వీరశృంఖలుడు వేరే ఉరికి వెళుతూ అక్కడ ఒక వీరవ్రతుడు అనే బ్రాహ్మణుడిని కలిసాడు. ఆ వీరవ్రతుడు విశృంకలుడిని చూసి బ్రాహ్మణుడైన అతని ముఖంలో బ్రాహ్మణా కలలేదుఅని దివ్య దృష్టితో చూసి విశ్రుంఖలుడు అతని పాపాలను చెప్పసాగాడు. విశ్రుంఖలుడు అన్ని విని తాను చేసిన తప్పులకి బాధపడి తనను కాపాడమని ఇంక నుంచి మంచిగా ఉంటాను నాకు ప్రాయశ్చిత్తాని చెప్పమని వేడుకున్నారు. అందుకు ఆ వీరవ్రతుడు నువ్వు నీవు చేసిన పాపములను చెపుతూ తీర్ధయాత్రలు చేస్తూ అన్ని నదులలో స్నానం ఆచరించి శివకేశవులకు భేదం చూపకుండా వారిని పూజించి కేవలం బిక్ష చేసుకొనే భుజించాలి. అలాగే ప్రయాగ క్షేత్రంలో మాఘమాసంలో స్నానం ఆచరించి రోజు మాధవుడిని దర్శించు ఇలా పన్నెండు సంవత్సరాలు చేయి అని చెప్పారు. అందుకు ఆ విశ్రుంఖలుడు అలాగే చేస్తాను స్వామి. నాకు ధర్మాన్ని ఉపదేశించండి అని కోరుకున్నారు. అందుకు వీరభద్రుడు నువ్వు ముందు ప్రాయశ్చిత్తం చేసుకొనిరా అపుడు చెపుతాను అని వెళ్లిపోయారు. విశ్రుంఖలుడు అతని మిత్రుల దగరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. వారందరు కూడా తమకు నరకం సంభవిస్తుంది అని కంగారు పడ్డారు. అప్పటి నుండు తల ఒకరు తల ఒక దిక్కుకి తీర్థయాత్రలకు బయలుదేరారు. విశ్రుంఖలుడు అలా పన్నెండు సంవత్సరాలు పూర్తిచేసుకొని చివరిగా నైమిశారణ్యానికి వెళ్లారు. అక్కడ తనకు బోధించిన వీరభద్ర బ్రాహ్మణుడు కనిపించారు. విశ్రుంఖలుడు వీరభద్ర  బ్రాహ్మణుడిని చూడగానే అతని కాళ్లకు నమస్కరించి మీరు చేపినటే ఈ పన్నెండు సంవత్సరములు పూర్తిచేసుకొని వచ్చాను. నాకు ధర్మాన్ని ఉపదేశించండి అని వేడుకున్నారు. తీర్ధయాత్రలు చేసిన ఫలితముగా విశృంకలుడి ముఖం పాపములు నశించి కాంతితో వెలిగిపోతుంది. వీరభద్రుడు విశృంకలుడికి ఇక్కడ అనేకమైన మంత్ర జలాలు ఉన్నాయి వాటిలో మూడు రోజులు స్నానం ఆచరించి నిరాహారిగా ఉండి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర దేవాలయం, కాళికాలయం, సుత మహర్షి గద్దె అని దర్శించు అనిచెప్పారు. నిరంతరము సంతోషంగా ఉండాలి. నిత్యం నారాయణ నామస్మరణతో గడపాలి. నివ్వు నిత్యం గృహస్థ ఆశ్రమమును స్వకరించామని, ఇంద్రియ నిగ్రహముతో ఉండి నిత్యం అగ్ని హోత్రంతో చేస్తూ అతిధులను సేవిస్తూ నిత్యం దానధర్మాలు తప్పకుండా నారాయణుడిని పూజించు అని చెప్పారు అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 25వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...