మాఘ పురాణం 21

మాఘమాసం 21వ రోజు పారాయణం

శివ స్తుతి



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 21వ రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో ముందు అధ్యాయంలో శివుడు, బ్రహ్మ నేను గొప్ప, అంటే నేను గొప్ప అని వాదన జరిగింది కదా. వారి వివాదమును తీర్చటానికి శ్రీమహావిష్ణువు విరాట్ స్వరూపములో కనిపించి వారిని శాంత పరచి మళ్ళి దివ్య స్వరూపములో కనిపించి ముందు తన కుమారుడైన బ్రహ్మను శాంతిపచేసి తరువాత శ్రీ మహా విష్ణువు శివుడిని ఎలా స్తుతిస్తారు. మహేశ్వర నువ్వు నాతో సమానుడవు. మన ఇద్దరికి భేదం లేదు. నివ్వు సర్వ పూజ్యుడవు, సర్వ వ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వ వ్యాపివి, సర్వాత్మకుడవు నేను ఏటువంటి వంటినో నువ్వు అటువంటివాడివి. నీకు నాకు భేదం లేదు. నేను నారదుడికి నీ మహిమ చెప్పాను. అప్పుడు అతను నీ అనుగ్రహం కోసం తపస్సు చేసాడు. నిన్ను దర్శించాడు. నువ్వు అతనిని అనుగ్రహించవు. అతను నిన్ను ఎలా స్తుతిచాడో గుర్తుంది కదా. నివ్వు అది మధ్యాంత రహితుడవి. తుది మొదలు లేని వాడివి. అప్పుడు నారదుడు చేసిన ఈ స్తోత్రం విని నువ్వు ఎంతో సంతోషించావు కదా. మునులు, ఋషులు, మహర్షులు ఈ స్తోత్రం చేస్తూ నిన్ను పూజించారు కదా. కాబ్బటి నీకు నాకు బ్రహ్మకు భేదము లేదు. మన ముగ్గురికి భేదము ఉంది అని తలచే ముడులు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. శ్రీమహా విష్ణువు అంతర్ధానము అయ్యారు. శ్రీమహావిష్ణువు ఈవిధముగా బ్రహ్మ మహేశ్వరుల వివాదమును సరిచేశారు. లోకానికి ఏవిధముగా ఈ విషయాన్ని తెలియచేసారు. మునులకు జరిగిన వాదనను తీర్చటానికి ఇలా ఒక చిన్న నాటకాన్ని ఆడటం జరుగుతుంది. త్రిమూర్తులకు అబేధము లేదు అని లోకానికి ఈ విషయాన్ని తెలియజేసారు. వాస్తవానికి ముగ్గురకు భేదం లేకున్నా భేదం ఉంది అని తలచి వాదించే అహంకార పండితులకు కోసమే ఈ సంఘటన జరిగింది. మాఘ మాస వ్రతాన్ని ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించాలి. అజ్ఞానముతో ఆలోచించకూడదు. బుద్ధి మంతులు సత్వ గుణ ప్రధానుడైన శ్రీమహావిష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహములో పారములో సుఖిస్తారు. వృధా వాదనలు అహకారులకే కానీ బుద్ధి మంతులకి కాదు. సర్వాధికులు, సర్వోత్తములు, సర్వవ్యాపకులు అయినా త్రిమూర్తులకు అబేధము ఏమిటి అని గృతజ్ఞ మహర్షి అన్నారు. ఇంకా ఇలా చెప్పసాగుతూ శివుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తారు. విష్ణుమూర్తి శివుడిని ధ్యానిస్తారు. జ్ఞానం కలగాలని అహంకారం వదిలి పెట్టాలని మన లాంటి ముర్కులను దారిలో పెట్టాలని ఇటువంటి ఒక సంఘటనను త్రిమూర్తులు సృష్టించారు. గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకొని మాఘ మాస వ్రతాన్ని ఆచరించాలి అని సూచించారు. విష్ణు కథను విని ధరించాలి. సాటివారికి దయను చూపించాలి. ఉన్నా దాంట్లో ధన ధర్మాలు చేయలి అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 21వ రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.    

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...