రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం రామరావణ యుద్ధం తరువాత సీత సమేతంగా రాముడు పుష్పకవిమానం మీద వస్తుండగా సముద్రం ఇవతల దిగ్గారు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడు మైన పుట్టుకతో బ్రాహ్మణుడు కనుక అతనిని వధించటం వలన తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది అని రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకున్నారు. విభీషణుడు ముహూర్తం పెట్టారు. రాముడి దగ్గర హనుమంతుడు కైలాసానికి వెళ్లి శివలింగమును తీసుకురావటానికి వెళ్లారు. హనుమంతుడు వెళ్లి చాలాసేపయింది కదా అని ఈ లోపు సీతామాత ఇసుకతో ఒక శివలింగాన్ని తయారుచేసింది. శ్రీరాముడు ముహూర్తసమయం అయింది ఆ ఇసుక లింగాన్ని శాస్త్రోప్తంగా ప్రతిష్టించారు. తరువాత ఆంజనేయుడు శివుడిని అడిగి శివలింగాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించటం చూసి ఆంజనేయస్వామికి కోపం వచ్చింది చాల బాధపడ్డారు. శ్రీరాముడు వచ్చి ఆంజనేయ బాధపడకు ముహూర్తం దాటిపోతుంది అని ఇసుక లింగాన్ని ప్రతిష్టించను. అనే కాదు స్వామి నేను చాల కష్టపడి శివలింగాన్ని తీసుకువచ్చాను దానినే ప్రతిష్టించాలి అన్నారు. శ్రీరాముడు ఎంత చూపిన ఆంజనేయ స్వామి వినటం లేదు అని సరే నేను ప్రతిష్టించిన శివలింగాన్ని తీసెయ్యి నువ్వు తెచ్చింది ప్రతిష్టిద్దాము అన్నారు. వెంటనే ఆంజనేయస్వామి తన తోకతో శివలింగాన్ని చుట్టి కదపటానికి ప్రయతించారు. ఎంత ప్రయతించిన శివలింగం కదలక పోవటంతో ఆంజనేయస్వామికి ఏమి చేయాలో అర్థం కాలేదు. శివుడు ఆ లింగములో ప్రత్యక్షమై ఆంజనేయ బాధపడకు ఆ శివలింగాన్ని సాక్షాత్తు అమ్మవారు స్వరూపమైన సీతాదేవి వలన తాయారు చేయబడి శ్రీమహావిష్ణువు స్వరూపుడైన శ్రీరాముడితో ప్రతిష్టించబడింది కాబ్బటి అది జ్యోతిర్లింగం అయింది. శ్రీరాముడి చేతప్రతిష్టించబడినది కాబ్బటి ఈ శివలింగం రామేశ్వర జ్యోతిర్లింగం అయింది. నీవు తెచ్చిన శివలింగం నా అనుగ్రహంతో స్పటిక లింగం అవుతుంది. ఈ లింగాన్ని కూడా ప్రతిష్టించాంది. హనుమన్నతుని చేత ప్రతిష్టించిన లింగం కాబ్బటి హనుమంతేశ్వర లింగం అని పేరు వస్తుంది. రామేశ్వర శివలింగం తో పటు ఈ శివ లింగాన్ని కూడా దర్శనం చేసుకుంటే జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నా పుణ్యం ఫలితం వస్తుంది అని శివుడు అదృశ్యమయ్యారు. ఈ రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న, ఈ కథ చదివిన సకల పాపములు శాశించిపోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...