డాకిని భీమశంకర జ్యోతిర్లింగం విశిష్టత

డాకిని భీమశంకర జ్యోతిర్లింగం విశిష్టత



            కామరూప దేశంలో పూర్వకాలంలో అడవులలో భీముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కాసి. భీముడు ఒకసారి తోటిపిల్లలతో ఆడుకుంటుండగా తోటిపిల్లలు ఆటలలో కాపురాలు చెప్పుకుంటూ మా నాన్న నాన్న అంటూవుంటే భీముడికి అనుమానం వచ్చి వెంటనే తల్లి అయినా కర్కాసి దగరకు వెళ్లి అమ్మ! మా నాన్న ఎవరు. నాన్న మన దగర ఎందుకు ఉండటం లేదు అని అడిగాడు. అందుకు తల్లి మీ నాన్న కుంభకర్ణుడు. మీ పెద్దనాన్న రావణుడు. మీ నాన్న కుంభకర్ణుడు రాముడి యుద్దములో మరణించాడు. మా నాన్న పేరు కర్కాటుడు. కొన్నాళ్లకి నేను జన్మించాను. నాకు మా పేరే నాకు కూడా కర్కటి అని పెట్టారు. నేను పెద్ద అయినా తరువాత విరాజుడుకి లేచి వివాహం చేసారు. రాముడు వనవాసం చేస్తూ వచ్చి రాముడికి విరాజుడికి యుద్ధం జరిగి విరాజుడు మరణించాడు. ఆడదానిని కనుక నను ఏమి చేయలేదు. నేను అడవిలోకి పారిపోయాను. అడవిలో భయపడుతూ ఉండగా ఒకసారి కుంభకర్ణుడు నను చూసి మోహించి నాకు నిన్ను ఇచ్చారు. నను వివాహం చేసుకోలేదు. కుంభకర్ణుడుతో నను కూడా తనతో తీసుకు వెళ్ళమని అడిగాను. అయన ఒప్పుకోలేదు నన్ను ఇక్కడే వదిలేసారు. నా భర్త విరాజుడు, మీ తండ్రి కుంభకర్ణుడు. నేను ఇంకా అక్కడ ఉండలేక నా తల్లీతండ్రుల దగరకు వేళ్లను. కోణాలకు నువ్వు జన్మిచావు. కొన్నాళ్లకి కర్కాసి తల్లితండ్రులకు నరమాంసం తినాలని అనిపించి చూస్తుండగా అక్కడకి అగస్యమహర్షి శిష్యుడు సుతిషుణుడు అక్కడకి వచ్చారు. అతనిని చంపాలని కర్కాసి తల్లితండ్రులు పడ్డారు. ఆ మహర్షికి కోపంతో హుంకారం చేసారు వాళ్ళు మాడిమసయిపోయారు. నేను భయపడి నిన్ను తీసుకొని ఈ కొండా గుహలో దాక్కున్నాను. ఇక్కడే ఉండిపోయాను. కొన్నాళ్లకి రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు, రావణుడు మరణించారు. నువ్వు పెరిగి పేదవాడివయ్యావు. నా మాట విని నువ్వు రాముడి మీద పగ పెట్టుకోకు అంత శక్తివంతుడైన మీ తండ్రే రాముడి ముందు నిలబడలేదు. నా ఇద్దరు భర్తలు మరణించారు. నా తల్లి తండ్రులు మరణించారు. నీకు ఉంది నువ్వు ఒక్కడివే అని బాధపడింది. అంత విన్నాడు కానీ భీముడికి మనసులో తన తండ్రిని చంపినా వాళ్లపై పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు భీముడు ఆలోచిస్తుండగా అక్కడికి రావణుడికి కొంతకాలం పురోహితుడిగా పనిచేసిన మాల్యవంతుడు వచ్చాడు. భీముడి మాల్యవంతుడు ఒకరిగురించి ఒకరు తెలుసుకొని భీముడు నాకు మాతండ్రిగారి మరణంపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉంది నాకు మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. మాల్యవంతుడు భీముడితో భీమా! నువ్వు తపస్సు చేసి బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి వరం అడుగు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. భీముడు వెంటనే డాకిని అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేయటం మొదలు పెట్టాడు. మరికొంతకాలానికి భీముడి తపస్సు తీవ్రతరం అయింది. అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ దేవుడు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యారు. భీముడు నమస్కరించి నాకు చావులేకుండా వరం ఇవ్వు అని అడిగారు. అందుకు బ్రహ్మదేవుడు చావు లేకుండా వరం ఇవ్వటం కుదరదు. ఇంకా ఏమయినా అడుగు అన్నారు. భీముడు అయితే నాకు మతిముద్దలోనుంచి ఒక తేజస్సు వచ్చి నన్ను చంపాలి అని కోరుకున్నారు. బ్రహ్మ దేవుడు తధాస్తు అని అదృశ్యమయ్యారు. బీముడి అహంకారంతో తన తల్లి దగరకు వెళ్లి చూసావా అమ్మ నేన్ను బ్రహ్మ దేవుడి దగర వారములు పొందాను. నాకు ఇంకా ఎదురు లేదు అని విర్రవీగాడు. అతని తల్లి నువ్వు ఏమయినా చేయి ఎవరినైనా ఎదిరించు కానీ విష్ణుమూర్తి గోలికి వేలకు నీకు పుణ్యం ఉంటుంది. రాముడు ఈపాటికే దేహత్యాగం చేసారు అంట అన్నది. భీముడు సరే అన్నారు. వెంటనే యుధ్ధానికి బయలుదేరాడు. సమస్తలోకములపై దండయాత్ర చేసి అన్నిటిని వశం చేసుకున్నాడు. ఒక కామరూప దేశం పైన కూడా దండయాత్ర చేసి రాజు సుధక్షుణుడిని ఓడించి ఆ రాజుని అతని భార్యని గొలుసులతో కాటేసి చెరసాలలో బంధించారు. ఈ సుధక్షుణుడు గొప్ప శివ భక్తుడు. అతను ఏమి చేసిన చేయక పోయిన శివ పూజ చేయకుండా ఉండలేరు. చెరసాల మట్టినేల అవటం వాళ్ళ ఆ మట్టినే పోగుచేసి మట్టిముద్దను చేసి దానితో శివలింగాన్ని చేసారు. పూజకి ఏమిలేకపోయిన వాటిని మనస్సులోనే ఊహించుకుంటూ మానసిక పూజ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలానికి దేవతలు భీముడి భాదలు పడలేక బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లరు. వారి భాదలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వీరిని తీసుకొని కైలాసానికి వెళ్లరు. మహాదేవుడు వారి మొరలను విని వారితో భీముడి తపస్సు వలన వచ్చిన పుణ్యం అయిపోవచ్చింది. అతనిని సంహరించటానికి సమయం ఆసన్నమైనది. కానీ నేను నేరుగా వెళ్లి సంహరించలేను ఎందుకంటే బ్రహ్మ దేవుడు అతనికి మట్టిముద్దలో నుంచివచ్చిన తేజస్సు వచ్చి సంహరించాలి అని కోరుకున్నారు. నేను బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరమును గౌరవిస్తున్నాను. భీముని చెరసాలలో నా పరమ భక్తుడు అయినా సుధక్షుణుడు ఉన్నాడు. దేవతలారా మీరు వెళ్లి సుదక్షునితో రేపు భీముని మరణం ఆసన్నమైనది. ప్రాణం పోయిన కూడా ఏమి జరిగిన శివ పూజ మాత్రం మానదు అని చెప్పమని చెప్పారు మహాదేవుడు. దేవతలు అదృశ్య రూపములో వెళ్లి సుదక్షిణుడికి చెప్పారు. అపుడు సుధక్షుణుడు అలాగే స్వామి రేపు ఏమి జరిగిన నేను మరణించేవరకు శివ పూజ మానను అని చెప్పారు. ఇక్కడ భీముడు భటులతో సుధక్షుణుడు మారాడా నన్ను స్మరిస్తున్నారా వెళ్లి ఒక సారి చూసి రండి అని చెప్పారు. శివుడు కూడా సుధక్షుణుడు పూజ చేస్తున్న శివలింగంలోకి వచ్చేసారు. భటులు చూసి వచ్చి భీముడితో మహారాజ సుధక్షుణుడు శివుడిని పూజ చేస్తున్నాడు. మిమల్ని పూజించటం లేదు అని చెపుతారు. భీముడికి కోపం వచ్చింది వెంటనే సుధక్షుణుడి దగరకు వచ్చి సుధక్షుణుడిని ఇవతలకు లాగి కొట్టసాగారు. భీముడు ఎంత కొట్టిన శివ శివ అనటం మానలేదు. శివలింగాన్ని పడేస్తాను అని మట్టి శివలింగం మీదకి తన కత్తిని విసిరాడు. కతివెళ్లి శివలింగం మధ్యలో గుచ్చుకుంది. వెంటనే శివలింగంలో నుంచి శివుడు భీకర ఆకారంతో వచ్చారు. భీముడు వెంటనే అహంకారంతో శివుడి మీదకు యుద్ధనికి వేలాడు. శివుడు ఒక హుంకారం చేసారు వెంటనే భీముడు రాక్షసులతో సహా కాలి భూడిద అయిపోయారు. భీముడు భస్మమై శివుడి మీద పడి భస్మాభిషేకం చేసినట్టు అయింది. ఇక నుంచి భస్మంతో నన్ను పూజించిన వారికీ సకల కోరికలు వేరవేరతాయి. నా భక్తులందరూ భస్మం(విభూధిని) ధరించినా వారు నాకు ప్రీతిపాత్రులు. విభూధిని ధరించి ఉండగా మరణం సంభవిస్తే వారు నరకానికి వెళ్లారు. నా సన్నిధానానికి వస్తారు. భీముడిని సంహరించిన ప్రదేశం కాబటి నేను భీమశంకరా జ్యోతిర్లింగంగా వెలుస్తాను. సుదక్షిణ మహా రాజా ఈ డాకిని ప్రదేశములోనే నేను వెలిసాను కాబటి నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిచు అని చెప్పారు. శివునికి ఆలయాన్ని నిర్మించే అదృష్టం తనకు కలిగినందుకు సుధక్షుణుడు సంతోషించారు. సుధక్షుణుడికి అప్పటి నుండి ఎటువంటి ఆపదలు రాకుండా సురక్షితంగా రాజ్యాన్ని పాలించారు. ఆఖరున శివ సాన్నిధ్యం చేరుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...