వైద్యనాథ జ్యోతిర్లింగం విశిష్టత

వైద్యనాథ జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం పులస్తుడు అనే ప్రజాపతి ఉండేవారు. విశ్రవసు అనే కుమారుడు ఉన్నాడు అతని రెండొవ భార్య కైకసి. వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వాళ్ళు రావణుడు, కుంభకర్ణుడు, సూర్పనఖ, విభిషణుడు. ఒకసారి వీళ్ళు ఒకసారి తమ తల్లి కైకసి దగరకు వెళ్లరు. వాళ్ళు అమ్మ నీకు ఏమైనా కోరిక ఉంటె చూపు తీరుస్తాము అన్నారు. ఈ కైకసి గొప్ప శివభక్తురాలు. నాకు శివ జ్యోతిర్లింగం కావాలి. దానిని ప్రతిరోజు పూజచేసుకుంటాను లంక నగరానికి తీసుకురండి అన్నారు. వారిలో రావణుడు నేనే తీసుకువస్తాను అని బయలుదేరారు. కైలాసపర్వతం దగరకు వెళ్లరు శివుడిని అత్యంత భక్తితో ప్రాదించారు. శివుడు ప్రత్యక్షమవలేదు. హిమాలయాలలో దక్షిణభాగములోకి వెళ్లి అక్కడ అగ్నిని మండించి అందులో కూర్చొని తపస్సు చేయటం మొదలు పెట్టాడు. తరువాత ఎంత తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణాసురుడు ఇక తపస్సు చాలించి తన తలలను అగ్నిలో వేయటం మొదలు పెట్టాడు. తొమ్మిది తలలు వేసాడు. పదోవతల వేసేటపుడు శివుడు ప్రత్యక్షమయ్యారు. రావణ ని తపస్సుకి నీ త్యాగానికి మెచ్చాను. నీకు ఏమివరం కావాలో కోరుకో అన్నారు. అపుడు రావణుడు పరమేశ్వర నాకు జ్యోతిర్లింగం కావాలి నేను లంకలో ప్రతిష్టించి పూజించుకుంటాను. అపుడు మహాదేవుడు రావణ అలాగే నువ్వు అడిగిన వరం ఇస్తున్నాను. కానీ జ్యోతిర్లింగానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నీవు జ్యోతిర్లింగంతో ఆకాశగమనం చేయకూడదు ఇది శక్తివంతమైనది నడిచే వెళాళ్లి. ఇంకొకటి ఈ జ్యోతిర్లింగం లంకకు వెళ్లెవరకూ భూమిపైనా పెట్టకూడదు. భూమిపైనా పెడితే నేను కూడా తీయలేను అని చేపి జ్యోతిర్లింగం రావణుడికి ఇచ్చి మహాదేవుడు అదృశ్యం అయ్యారు. రావణుడు సంతోషంతో జ్యోతిర్లింగం తీసుకొని నడిచి వెళతాం మొదలు పెట్టారు. మహాదేవుడు రావణుడికి జ్యోతిర్లింగాని ఇచ్చాను కానీ అతని ఆలోచన మంచిగా లేదు. ఇప్పటికే రావణుడు చాలా పాపాలు చేస్తున్నాడు. దేవతలు అందరూ మొరపెట్టుకున్నారు. ఇపుడు నా జ్యోతిర్లింగం కూడా వెళితే నా బలం కూడా పెరిగి రావణుడు ఇంకా రెచ్చిపోతాడు. ఇతను పాపాలకి ఇంకా అడ్డుఅదుపు ఉండదు అని రావణాసురుడిని పరీక్షించాలి అనుకున్నారు. మహారాష్ట్రకు రాగానే మూత్రవిసర్జనకు వెళ్లవలసి వచ్చింది. ఆపుకోలేనంత బాధవచేసింది. రావణుడు చుటూ చూసాడు అక్కడ ఒక గోపాలబాలుడు ఉన్నాడు. అతనిని పిలచి ఈ శివలింగాన్ని కాసేపు పట్టుకో నేను ఇపుడే వస్తాను. నేను వచ్చేవరకు పట్టుకో ఇకు ఏమి కావాలి అంటే అది ఇస్తాను అని చేపి ఆ శివలింగాన్ని ఆ గోపాలుడికి ఇచ్చారు. ఆ గోపాలుడు శివలింగాన్ని మోయలేక మోతున్నాను చాలా బరువుగా ఉంది నువ్వు తొందరగా రామన్నాడు. రావణుడు మూత్ర విసర్జనకు వెళ్లరు. రావణుడు వచ్చేలోపు ఈ శివలింగం బరువు మోయలేక రావణుడిని పిలిచి నేను కింద పెటేసి వెళ్లి పోయాడు. రావణుడు వచ్చి శివలింగాన్ని కదిలించటానికి ప్రయతించాడు. కానీ రాలేదు. భూమి అదిరిపోయింది కానీ శివలింగం కదలలేదు. మహాదేవుడు ప్రత్యక్షమై రావణ జ్యోతిర్లింగం భూమి ఆకర్షణ శక్తికి పైకి రాదు. నేను కూడా తీయలేను. దీనిని ఇక్కడే ఉండనే ఉండనీయి. ఈ జ్యోతిర్లింగాన్ని పెకలించటానికి ప్రయత్నిచి శరీరమంతా గాయాలు అయ్యాయి. ఈ జ్యోతిర్లింగానికి అర్చన చేయి నీ గాయాలు మాయ మవుతాయి. ఇకనుంచి ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాధ జ్యోతిర్లింగం అని పిలుస్తారు. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగం మొదలు కోనా బీహార్లో ఉంటుంది. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగం పూజించిన వారికీ సకల దీర్ఘకాల వ్యాధులు తగిపోతాయి. రావణుడు సంతోషించి లంకకు వెళ్లరు. తన తల్లికి జరిగినదంతా పెట్టాడు. అప్పటి నుంచి రావణుడు ప్రతిరోజు వైద్యనాధ జ్యోతిర్లింగంను నియమనిష్టలతో పూజించేవాడు.  

రావణుడు జ్యోతిర్లింగాని పూజించటం వల్ల అతని శక్తులు ఇంకా పెరిగాయి వేయి ఏనుగుల బలం వచ్చింది. ఇది అంత చుసిన నారదమహర్షి అందరూ చాలా భాద పడుతున్నారు. దీని ఎలాగైనా ఆపాలి అని రావణుడి దగరకు వెళ్లరు. రావణుడు నారదమహర్షిని ఆహ్వానించి కుర్చోపెట్టాడు. నారదమహర్షి రావణుడితో రావణ! నువ్వు చాలాగొప్ప వాడివి. సాక్షాత్తు జ్యోతిర్లింగాని సంపాదిచారు. కానీ కొంత మంది మహాదేవుడిని అయితే మేపించారు కానీ కైలాస పర్వతాన్ని పెకలించలేరు అని అంటున్నారు. ఆ మాట విగానే రావణుడికి కోపం వచ్చింది. నారద మహర్షితో శివుడు గొప్పవాడు కాదు నేను తపస్సు చేయటం వల్ల ఆయనకు ఆ గొప్పతనం వచ్చింది. వెంటనే బయలుదేరి కైలాసానికి వెళ్లరు. నారద మహర్షి అహంకారం ఎంత పనినైనా చేయిస్తుంది. అనుకోని అక్కడినుంచి వెళ్లిపోయారు. రావణుడు కైలాసానికి వేరేటప్పటికీ శివ పార్వతులు తాండవం చేస్తున్నారు. రావణుడు వెంటనే తన పది తలలు ఇరవై చేతులతో కైలాసాని ఎత్తటం మొదలు పెట్టాడు. రావణుడి వల్ల కాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నిచి అతని పది తలల పైన పెట్టుకున్నాడు. ఆ కుదుపుకి నాట్యం చేస్తున్న పార్వతీదేవి పక్కకు ఒరిగింది. శివుడు అది చూసి ఎంత అహంకారం ఏ జ్యోతిర్లింగం దకిందని నువ్వు ఇంత అహంకరిస్తునావో ఆ జ్యోతిర్లింగాని మరచిపోవుతువు గాక, ఈ చేతులు, తలలు ఉన్నాయని విర్రవీగుతున్నావో వాటిని శ్రీమన్నారాయణుడు మానవుడై జన్మించి వాటిని తరువాత నిను సంహరిస్తాడు అని శపించారు. ఇది జరగాలని నారదమహర్షి ఆశించారో లోకకల్యాణం కోసం జరిగింది అని సంతోషించి రావణుడి దగరకు వచ్చారు. రావణుడికి శివుడు శపించిన విషయం తెలియదు. నారద మహర్షి కూడా చెప్పలేదు. మల్లి చెపితే శివుడి కాలపై పడి మళ్ళి వరాలు అడుగుతాడు అని చెప్పలేదు నారద మహర్షి. రావణుడు అహకారంతో సంతోషించి ఇంటికి వేళాడు. తరువాత రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాడు. ఈ వైద్యనాధ జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికీ ఈ కథ విన్నవారికి అప్పటి వరకు చేసిన పాపములు పోతాయి అని వరం ఇచ్చారు మహాదేవుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...