కాశీలోని 12సూర్య దేవాలయాలలో నాలుగోవది ద్రుపద ఆదిత్యుడు.
4. ద్రుపద ఆదిత్యుడు
పూర్వకథ :- ద్రౌపది దేవి పూర్వజన్మలో ఇక్కడే తపస్సు చేసి పరమశివుడిని మేపించి పతి కావాలి అని వరం కోరుకుంది. ఆమె ఆపకుండా 5సార్లు పతి అని అనటం వలనే ఆమెకు మరు జన్మలో 5గురు భర్తలు వచ్చారు అని మహాభారతంలోని కథ. అంతే కాకుండా వనవాసంలో ఉండగా ధర్మరాజు, ద్రౌపతి కూడా ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేసారు ఆహారం కోసం సూర్యుడు వారి తపస్సుకి మెచ్చి అక్షయ పాత్రా ప్రసాదించాడు.
విశేషం :- ఈ స్వామిని పూజించిన వారికీ జన్మలో ఆహారానికి లోటు రాదు అని ప్రతీతి.
స్థలం :- ఈ ఆలయానికి వెళ్లటానికి వెళ్లే ఒకటో నెంబర్ గేటులో నుంచి లోపలికి వెళితే టుంటి గణపతి ఆలయం వస్తుంది. కొంచెం ముందుకు వెళితే అన్నపూర్ణ దేవి ఆలయం వస్తుంది. ఇంకాకొంచం ముందుకు వెళితే అక్షయవటవృక్షం వస్తుంది. అక్కడ చుట్టు వెతికితే ఒక మూల చిన్న శిలలాగా వుంది. దానిపైన చిన్న ఆదిత్యుడి విగ్రహం ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి