కాశీలోని 12సూర్య దేవాలయాలలో పదకొండోది ఉత్తరార్క ఆదిత్యుడు.
ఉత్తరార్క ఆదిత్యుడు
పూర్వకథ :- ప్రియవ్రతుడు అనే భార్యాభర్తలకు ఒక సులక్షణ అనే కుమార్తె ఉండేది. ఆమెకి జాతకం సరిగా లేక వివాహం జరగదు. కొనాలకి ఆ భార్యాభర్తలు ఆ బాధతో చనిపోతారు. ఈ సులక్షణ బాధపడి జాతక దోష పరిష్కరం సూర్య ఆరాధన ఒకటే అని మార్గం అని ఇక్కడికి వచ్చి సూర్యుడిని ప్రతిష్టించి ప్రతిరోజు బకిరియా కుండ్ లో స్నానం చేసి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు మొదలు పెట్టగానే ఎక్కడినుంచి వచ్చేదో ఒక మేక ఆమె పక్కన వచ్చి కూర్చునేది. కొన్నాలకి ఈమె తన తపస్సుని తీవ్రతరం చేస్తుంది. ఆ మేకాకుండా ఆమెతోపాటే అక్కడే ఉంటుంది. కొన్నాళ్లకి పార్వతి, ఈశ్వరులకి జాలి కలిగి ఆమెకు దర్శనం ఇచ్చి ఏమివరం కావాలో కోరుకోమని అడిగితే ఆమె నాకు కాదు ఈ మేకకు వరం ఏవండీ అమ్మ కావాలంటే నేను మళ్ళి ఉపాసన చేసి సాధించగలను కానీ మేక అలాగకాదు కదా. దానికి పార్వతీపరమేశ్వరులు ఆమెకు ఉత్తమామనైనా జన్మను ప్రసాదిస్తారు. సులక్షణ భాతదయకు మెచ్చి ఆమెను పార్వతీదేవి తన చెలికతెలలో ఒకరుగా చేసుకుంటుంది.
విశేషం :- ఈ ఆదిత్యుడిని ఉపాసిస్తే ప్రమోషనులు వస్తాయి.
స్థలం :- వారణాశి జంక్షన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర బకిరియా కుండ్ దగ్గర ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి