పాండవుల అరణ్యవాసం


దూర్యోధనుడు మాయసభలో అవమానపడనని హస్తనకి వచ్చిన దగ్గరనుండి కుమిలిపోతు పాండవుల వైభవని చూసి సహించలేక వల్ల రాజ్యాని ఎలాగైనా లాకోవాలని కుట్రలు పన్నాడు. అంతేకాకుండా ధర్మరాజు రాజసూయయాగం జరిగేటప్పుడు వచ్చిన కానుకలను లేకుంచే బాధ్యతని దూర్యోధనుడికి ఆపగించాడు. ఆ సమయంలో పాండవులకు వచ్చిన సంపదలను చూసి అసూయపడాడు. ఈ సంపాదలను ఎలాగైనా నా వశం చూసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుండి ద్వారకకు వేలాడు అని తెలుసుకొని తన మామ శకుని, కర్ణుడు, దుశాసనుడితో సమావేశం అయ్యాడు. నాకు పాండవుల సంపదలు చూస్తుంటే అసూయగా ఉంది. వాటిని ఎలాగైనా నావశం చేసుకోవాలి మయా సభలో నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అన్నాడు. అందుకు కర్ణుడు అయితే వాళ్ళమీదకి యుద్ధనికి వెళదాము అన్నాడు. అందుకు శకుని నీ ప్రతాపము ద్రౌపది స్వయం వరంలో చూసాముగా అర్జునుడు నిను చిత్తకొట్టాడు. అందులోనూ ఇప్పుడు ధర్మరాజు ఈ భూమాండలానికి చక్రవర్తి అయ్యాడు అతని బలం పెరిగింది. అతనితో మనం యుద్ధం చేయకూడదు. మాయోపాయంతో రాజ్యాని లాకోవాలి అనుకోని అని నా దగ్గర అగోర మంత్ర పాచికలు ఉన్నాయి నేను మంత్రం చదివి పాచికలు వేస్తే మనకి అనుకూలంగా పడతాయి. వాటితో వారిరాజ్యని లాకొందాము. వారిని అవమానిదాము అన్నారు. అప్పుడు దుశసనుడు మనం జూదానికి పిలిస్తే ధర్మరాజు వస్తాడా అన్నారు. అందుకు శకుని మనం పిలిస్తే రాదు మీ తండ్రి ధృతరాష్టుడు పిలిస్తే వస్తాడు. ఎందుకంటే తండి, తండ్రీవరుసవారు, సమానరాజులు యుద్ధనికి, జూదానికి పిలిస్తే తప్పకుండా వేలాలి. అది ధర్మం. ధర్మరాజు ధర్మం తప్పడు తప్పకుండా వస్తాడు. అని అన్నాడు. అందరు కలిసి ధృతరాస్టుని దగరకు వెళ్లి అతనిని ఓపించి విధురిని చేత కబురు పంపించారు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది సమేతంగా హస్తినాపురానికి వచ్చారు. భీష్మ, ద్రోణ, విధుర, దృతారాష్ట్ర మొదలినవారు ఆ సభలో ఉన్నారు. దూర్యోధనుడు ధర్మరాజు జూదం ఆడటానికి కూర్చున్నారు. దూర్యోధనుడు తన బదులు పాచికలు శకుని మామ వేస్తాడు అని తాను ఆటలో అంత నేర్పరిని కాదు అని అంటాడు. ధర్మరాజు సమస్త సంపదలు, రాజ్యాని, తన తమ్ముళ్లని తనని ఒడిఓడిపోయాడు. చివరికి ద్రౌపదిని కూడాఓడిపోయాడు. దూర్యోధనుడు అహంకారంతో రెచ్చిపోయి ద్రౌపది సభకి లాకురమ్మని ఒక పనివాడిని పంపారు. అతను ద్రౌపది దగరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ద్రౌపది దేవి ధర్మరాజు తాను ఓడిపోయినా తరువాత నన్ను ఓడడా, నన్ను ఓడినా తరువాత తాను ఓడేనా అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం అడుగు అయిన నేను రాజస్వలాలో ఎక వస్త్రను ఎప్పుడు సభకు రాలేను అన్నది. పనివాడు వచ్చి జరిగినది దూర్యోధనుడికి చెప్పాడు. అప్పుడు దూర్యోధనుడు దాసికి సమాధానం చెప్పవలసిన పనిలేదు దుశాసన వెళ్లి ఆ ద్రౌపదిని లక్కునిరా అని దుశాసానుడిని పంపారు. దుశసనుడు ద్రౌపది దేవిని జుట్టుపట్టుకొని లాకొచ్చాడు. ఆమె సభకి వచ్చిన తరువాత కూడా ఈ ప్రశ్ననే అడిగింది. కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. అప్పుడు కర్ణుడు లేచ్చి ఏక వస్త్ర అయితే ఏమిటి ఐదుగురు పురుషులతో కాపురం చేసే స్త్రీకి ఒకటిమీద బట్టలు ఉన్న లేకున్నా ఒకటే అన్నాడు. కర్ణుడు దూర్యోధనుడికి వస్త్రపహరణం అనే లేని ఆలోచనను పుటించింది. దుశసానుడిని పిలిచి ఈమె ఒంటిమిద చిరను లాగేయి అన్నారు. బీముడు లేచి నువ్వు ఈమె ఒంటిమిద చేయివేసావా నీ ఛాతిని చీల్చి నీ రక్తం తాగుతాను అన్ని శబధం చేసాడు. దుశసనుడు బిముడి మాటలు లెక్క చేయకుండా నువ్వు ఇప్పుడు మా బానిసవి నువ్వు మమ్మలిని ఏమి చేస్తావు. ద్రౌపది చీరాలాగటానికి వేలాడు. దూర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు దుశసానుడిని అడ్డుకొని అన్నయ్య ఆమె మనకు వదిన మాతృసమానురాలు మీరు ఎలాచేయకండి అన్నాడు. అప్పుడు కర్ణుడు మళ్ళి లేచి ఇక్కడ ఉన్న పేదలకు లేని మంచి నీకు కనిపించిందా వెళ్లి కూర్చో అన్నాడు. ఆ వస్త్రాపహారణాని చూడలేక ఆ అన్యాయని ఆపలేక భీష్మడు, ద్రోణుడు, విధురుడు కళ్లు మూసుకున్నారు. ఇక తనను రక్షించేవారు ఈ సభలో ఎవరు లేరు అని ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది. శ్రీకృష్ణా! గోవిందా! ద్వారకవాస! గోపీజనవలభ!ఆనాడు గజేంధ్రుడిని మొసలి బారినుండి రక్షించునట్టు నన్ను వీరి భారీ నుండి రక్షించు స్వామి హృదయనివాస కృష్ణా!కాపాడు అని ప్రార్ధించింది. దుశసనుడు ఆమె చీరను లాగుతుంటే ఒకచిరా వెంట ఒకచిరా వస్తూనే ఉన్నాయి. దుశసనుడు లాగిలాగి ఆ చీరలు ఒక చిన్నా కొండల తయారయయి. దుశసానుసు లాగలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసినా ఇంకా దూర్యోధనుడికి ఇంకా బుద్ధిరాక తన ఒడిలో కూర్చోమని ద్రౌపదిని పిలిచాడు. ఇది వినా బీముడు కోపంతో నీ తొడలు విరగొడతాను అని ప్రతిజ్ఞ చేసాడు. బీముడు అల ప్రతిజ్ఞ చేయగానే కౌరవులకు విరుద్ధంగా ఆపశకునాలు కనిపించాయి. దానితో భయపడిన గాంధారి ఏమి జరిగిందో విషయం తెలుసుకున్ని తన బిడ్డలకు ఆపద ఎక్కడ వస్తుందో అని పరుగు పరుగున సభకు వచ్చి ధృతరాష్టునీతో ఈ సభలో ఒక ఆడపిలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎలావురుకున్నారు. ఇది ధర్మమేనా. మీ అధ్యర్యంలో ఇంతటి అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నించ్చింది. అప్పటికే ఆపశకునాలకు భయపడిన ధృతారాష్టుడు  ద్రౌపదిని క్షమించమని నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు ద్రౌపది నా భర్త ధర్మరాజునూ దస్యావిముక్తుడిని చేయండి అన్నది. అందుకు ధృతారాష్టుడు సంతోషించి అలాగే చేస్తాను. ఇంకో వరం కోరుకో అన్నాడు. అందుకు ద్రౌపది ధర్మరాజు మిగిలిన తమ్ముళ్లని వారి అస్త్రాలతో సహా దాస్య విముక్తులను చేయండి అని కోరుకుంది. అందుకు ధృతారాష్టుడు సరే అలాగే చేస్తున్నాను అన్నాడు. ఇంకోవరం కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది క్షత్రియ కాంతకు రెండు వరాలు మాత్రమే కోరుకోవాలని ధర్మశాస్త్రం చెపుతుంది మహారాజ అన్నది. అందుకు ధృతారాష్టుడు ధర్మం గురించి ఎంతభాగా చెప్పవమ్మా మరి నిన్ను దాస్య విముక్తి చేయమని అడగలేదే అన్నాడు. అందుకు ద్రౌపది మహారాజ ధర్మరాజు దాస్యావిముక్తిని పొందగానే అయన భార్యను అయినా నేను దాస్య విముక్తిని అయ్యాను కదా మహారాజ అన్నది. అందుకు ధృతారాష్టుడు ధర్మశాస్త్రం గురించి ఎంత జ్ఞానం ఉంది. నీకు ఉన్న జ్ఞానంలో కొంత అయినా నా కుమారులకు జ్ఞానం ఉంటే నీకు ఈ అన్యాయం జరిగేది కాదు మీ సమస్త రాజ్యాని మీకు ఇస్తున్నాను అని అందరిని తిరిగి ఇంధ్రప్రస్థానికి పంపారు. దూర్యోధనుడు కొంతకాలం తరువాత మళ్ళీ తండ్రి దగరకు వచ్చి నాన్న మేము అన్ని పాణగాలు పన్ని వారి సంపదను లాకుంటే అమ్మ చెప్పింది అని వారిని పంపారు. ఎలాగైతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని తన తండ్రి బెదిరించాడు. అందుకు భయపడిన ధృతారాష్టుడు అల చేయకు నువ్వు ఏమి చేయమంటే అధిచేస్తాను అన్నాడు. అయితే మళ్ళీ వాళ్ళని జూదానికి పిలవండి అన్నాడు. చేసేది లేక ధృతారాష్టుడు పాండవులకి కబురు పెట్టాడు. ధర్మరాజు జరిగేది తెలిసే ధర్మానికి కట్టుపడి విధికి తలవొంచి మళ్ళీ వచ్చారు. ఈ సారి దూర్యోధనుడు ధర్మరాజుతో ఈసారి ఒకటే పందెం నేను గెలిస్తే నువ్వు నీ తమ్ముళ్లు ద్రౌపదితోసహా 12ఏళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి నీ రాజ్యం నాకు చెందుతుంది. నేను ఒడిపోతే నేను నా తమ్ముళ్లతో కలిసి అరణ్యానికి వెళతాను అన్నాడు. ధర్మరాజు చేసేదిలేక ఒప్పుకున్నాడు. పందెం దూర్యోధనుడు గెలిచాడు. ధర్మరాజు  తన తమ్ముళ్లు, ద్రౌపదతో  అరణ్యవసానికి వెళ్ళిపోయాడు.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...