రాజసూయ యాగం విజయవంతంగా సుసంపూర్ణమైన సమయంలో కల్మషచిత్తుడు, వంశనాశకుడు అయిన దుర్యోధనుడు తప్పించి, తక్కిన సమస్త ప్రజలూ రాజసూయయాగ వైభవానికి సంతోషించారు. దుర్యోధనుడు పాండవులకు ఎప్పుడూ అపకారమే చేస్తుంటాడు. అయినా శ్రీకృష్ణుని దయచేత కలిగిన దేవ, దానవ, నరులను పాలించే రాజ్య సంపదలను వైభవం కలవాడైనాడు ధర్మరాజు. ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూస్తున్న దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిండుకొలువు తీర్చి కూర్చున్నాడు. ధర్మరాజు మయసభ మధ్యలో ప్రకాశవంతమైన సింహాసనం మీద ఆసీనుడై కొలువుతీరి ఉన్న ధర్మరాజుని వీక్షించి శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ సమయంలో దురభిమాని అయిన దుర్యోధనుడు అక్కడకి వచ్చాడు. ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు. ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు. తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలి నుండి ద్వారకానగరానికి వెళ్ళాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి