జరాసంధుని వధ



శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఓ ధర్మరాజా! జరాసంధుడిని చంపడానిక ఒక ఉపాయం ఉంది. నాకు ఉద్ధవుడు చెప్పిన ఆ ఉపాయం వివరిస్తాను విను. మగధరాజైన జరాసంధుడికి బ్రాహ్మణులు అంటే భక్తివిశ్వాసాలు అధికం. వారేది అడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. కనుక, నేను, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాడిని యుద్ధభిక్ష కోరతాము. అతడు తప్పకుండా అంగీకరిస్తాడు. మల్లయుద్ధంలో భీముడిచేత అతడిని చంపించవచ్చు” అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మరాజు ఇది బాగుందని అంగీకరించాడు. తరువాత కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి బయలుదేరారు. అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు అతి త్వరగా గిరివ్రజానికి వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణుడు బీముడు, అర్జునితో అక్కడ జరసంధుడి కోటగోడా ప్రకారం మాయకవచంతో నిర్మించాబడింది ఇందులో నుండి బ్రాహ్మణులూ తప్ప మరెవరికి ప్రవేశం లేదు. సహశించి ఎవరైనా ప్రవేశిస్తే గుండె ఆగి మరణిస్తారు అందుకే మనం బ్రాహ్మణ వేషంలో వచ్చాము. మనం జరసంధుని మరణం కోరుతున్నాము కాబట్టి కోట ప్రవేశం ద్వారం గూడా కాకుండా కోట గోడ దూకి వెళదాము అన్నారు. అందుకు బీముడు అర్జునుడు సరే అని ముగ్గురు కోటగోడను దూకి వేళారు. జరసంధుని దగరకు వెళ్లారు. జరసంధుడు వీరిని చూసి బ్రాహ్మణులూ అనుకోని మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడితో అతిథి సేవ చేయటంలో బాగా పేరు పొందినవాడిగా దిగంత విశ్రాంతమైన నీ కీర్తి విని, నీ దగ్గరకు వచ్చాము. మా కోరిక కాదనక తీర్చు. ఇలా పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని యుద్ధలలో రాటు దేలిన శరీరాలను గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని “ఓ గుణవంతులారా! మీ మనస్సులోని కోరిక ఏమిటో చెప్పండి. మీరేది కోరినా ధైర్యంతో ఇచ్చేస్తాను. అంతేకాదు కోరితే చివరకు నా తలను ఇమ్మన్నా ఇచ్చేస్తాను.”  అని జరసంధుడు శ్రీకృష్ణా బీమా అర్జునుడితో అన్నారు. జరాసంధుడి మాటలు విని శ్రీకృష్ణుడు “మహారాజా! నీ సత్యవ్రత నిష్ఠ మాకు అవగతమైంది. మేము రణభిక్ష కోరుతున్నాం. ఇతడు వాయు పుత్రుడు భీమసేనుడు; ఇతడు ఇంద్రపుత్రుడు అర్జునుడు; నేను కృష్ణుడిని; మాలో ఎవరో ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చేయాలి.” అని అన్నారు. శ్రీకృష్ణుడి మాటలు విని, జరాసంధుడు నవ్వి “అహో ఎంత ఆశ్చర్యం. నిన్ను నేను యుద్ధరంగంలో తట్టుకోలేక భయంతో చాలా పర్యాయాలు పారిపోయాను. కృష్ణా! రణంలో నిన్ను ఎదిరించటం నాకు చాలా కష్టం కనుక నీవు తప్పుకో. అర్జునుడు బలశాలే కానీ చిన్నవాడు. ఈ భీముడు చూడటానికి నా బాహుబలానికి సమ ఉజ్జీలా ఉన్నాడు. కనుక వీడిని ఎదుర్కొంటాను” అని భయంకరాకారుడైన జరాసంధుడు భీముడితో యుద్ధానికి చేయి ఊపాడు. వాయునందను డైన భీముడికి జరాసంధుడు ఒక భయంకరమైన గదను ఇప్పించాడు. తాను ఒక గదను చేబట్టాడు. పిమ్మట నలుగురూ పట్టణానికి బయట ఒక సమతల ప్రదేశానికి వెళ్ళిభీమ జరాసంధులు ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేశారు. గదలతో భీకరంగా కొట్టుకుంటూ, ఒకరి నొకరు తాకుతూ, పైకెగురుతూ, వంగుతూ, త్రోసుకుంటూ, తన్నుకుంటూ, కుడి ఎడమలకు తిరుగుతూ, ఆకాశం బద్దలవుతోందా అన్నట్లు సింహనాదాలు చేస్తూ, రెండు గదల పరస్పర తాకిడులకు ఛట ఛట మంటూ నిప్పురవ్వలు రాలగా విజృంభించి వారు ఘోరంగా పోరు సాగించారు. అలా భీమజరాసంధులు పోరాడుతుండగా వారి గదాలు ఖండఖండాలు విరిగిపోయాయి. దానితో ఇద్దరూ నిరుత్సాహపడకుండా ముష్టియుద్ధానికి తలడారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుట్టుక చావుల గురించిన వివరాలు తెలిసినవాడు కాబట్టి, భీముడికి అలసట కలుగకుండా తన దివ్యతేజాన్ని అతడిలో ప్రవేశపెట్టాడు. శత్రుసంహార ఉపాయం ఆలోచించి, భీముడు చూస్తుండగా శ్రీకృష్ణుడు వీణ్ణి ఇలా చేసి చంపు అని సూచన అన్నట్లు, ఒక చెట్టురెమ్మను పట్టుకుని రెండుగా చీల్చి పడేసాడు. అది గ్రహించిన భీముడు తక్షణం జరాసంధుడిని క్రింద పడవేసి ఒక కాలును తన కాలుతో త్రొక్కిపెట్టి, రెండో కాలు చేతులతో గట్టిగా పట్టుకుని వాడిని తల వరకూ చీల్చి చంపేశాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పురజనులు భయంతో హహాకారాలు చేశారు. జరాసంధుడిని చంపినందుకు అర్జునుడూ కృష్ణుడూ ఆనందంతో భీముడిని కౌగలించుకున్నారు; అతని పరాక్రమాన్ని ప్రస్తుతించారు. దయామయుడూ భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు అప్పుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి పట్టం గట్టి మగధరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జరాసంధుడికి లోబడి అతడి చెరసాలలో దుఃఖంతో మ్రగ్గుతూ, తన పాదపద్మాలనే స్మరిస్తూ ఉన్న ఆ రాజులు అందరినీ అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. బంధవిముక్తులైన ఆ రాజులందరూ సంతోషించారు. కృష్ణుని పాదాలకు మ్రొక్కి, చేతులుజోడించి నమస్కారం చేసి అణుకువగా స్తుతించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రాజులతో ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు. కావున, ఈ శరీరం శాశ్వతంకాదని మీరు గ్రహించండి. మీరు ధర్మాన్నీ నీతినీ న్యాయాన్నీ తప్పకుండా ప్రజలు సుఖసంతోషాలలో మునిగితేలేలా పరిపాలన సాగించండి. నన్ను ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహించండి. నా పాదాలను భజిస్తూ పాపరహితులై చక్కగా ప్రవర్తించండి. మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు. తమ భార్యా పుత్రులు మిత్రులు మున్నగువారు సంతోషించగా నిర్మలహృదయులై పద్మాక్షుడు శ్రీకృష్ణుడి సద్గుణాలను సంకీర్తిస్తూ, రాజులు అందరూ న్యాయశీలురై శ్రీకృష్ణుడు ప్రబోధించిన ధర్మమార్గాన్ని తప్పక తమ తమ రాజ్యాలను వైభవంగా పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరించారు.









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...