తమని రక్షించమని శ్రీకృష్ణుడిని వేడుకున్న ఇరవైవేలమంది రాజులు


ఒకరోజు ఒక కొత్త బ్రాహ్మణుడు  వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. “రాజీవలోచనా! రాక్షససంహారా! యోగీశ్వర హృదయ రంజనా! తేజోనిధీ! దివ్యమంగళ విగ్రహా! శ్రీకృష్ణా! అనుగ్రహించు. దయచేసి నా విన్నపములు విను. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు. ఓ పురుషోత్తమా! నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీ కిప్పుడు మనవి చేస్తున్నాను. ఆపైన మీ దయ వారి అదృష్టం.” ఓ పుణ్యాత్మా! ఆర్తులము అయిన మమ్ముల్ని కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి, నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికీ; బలహీనులైన సన్మార్గులను రక్షించటానికీ; నీవు ప్రతీ యుగంలోనూ భూమిమీద అవతరిస్తూ ఉంటావు కదా. ఓ కృష్ణా! ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. మమ్మల్ని కాపాడు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించ లేక రాజులంతా నవ్వుతుండగా పదునెనిమిదిసార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. అయినా, వాడు తాను పడిన కష్టాలను గుర్తుపెట్టుకోకుండా మీడిసి పడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మమల్ని విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో నరద మహర్షి అక్కడకి వచ్చారు. శ్రీకృష్ణుడు తకిన సభలోని వారు అందరు నరదమహర్షిని సాధారంగా ఆహ్వానించారు. అప్పుడు శ్రీకృష్ణుడు నారద మహర్షితో నారదా! ఎక్కడనుండి ఇక్కడికి వచ్చారు. సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి” అని శ్రీకృష్ణుడు అడిగాడు. ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా స్వామి.” “ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు. ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. ధర్మజుడు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది అని అన్న నారద మహర్షి మాటలకూ శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. వినండి నారద మహర్షి చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం మీ కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్దవుడితో నీ ఉపాయం బాగుంది. అలాగే చేదాము అని అన్నారు. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడిని సత్కరించి అతనికి గోవులను సంపదలను దానంగా ఇచ్చి నేను అభయం ఇస్తున్నాను. జరసంధుడి చేరలో ఉన్న ఆ రాజులందరిని విడిపిస్తాను. వారిని భయపడవద్దు అని చేపి ఆ బ్రాహ్మణుడిని పంపించారు. ఆ బ్రాహ్మణుడు సంతోషంతో శ్రీకృష్ణుడిని ఒకసారి దర్శించుకున్నా చాలు ఇంకా జీవితంలో ఎలాంటి భయం లేకుండా బ్రతకగలిగే సంపదలు ఇచ్చారు. అని సంతోషంగా వేళారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గరకి బయలుదేరాటానికి సిద్ధం అయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...