భగవద్గీత ఆవిర్భావం
భగవద్గీత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భోదించారు. కౌరవులు రాజ్యాధికారం కోసం యుద్ధనికి సిద్ధమయ్యారు. పాండవమధ్యముడు, వీరుడు అయినా అర్జునుడు అయన రధసారధి పరమాత్మ అయినా శ్రీకృష్ణుడు ఉన్నారు. ఇరువైపులా యుద్ధవీరులు శంఖాలను పూరించారు. యుద్ధరంగములో ఉన్న తన బంధుమిత్రులను చూసి అర్జునుడు దుఃఖంతో నిరసించి ఈ యుద్ధం వల్లనా తనకు ఎలాంటి లాభం లేదుగాని నేను యుద్ధం చేయను అని శ్రీకృష్ణునితో చెపుతారు. శ్రీకృష్ణుడు ఆయనకు కర్తవ్యం బోధించటానికి భగవద్గీత బోధిస్తారు.
భగవద్గీత విశిష్టత
భగవద్గీత సమస్త వేదముల సారము. ఉపనిషత్తుల సారము. భగవద్గీతను అధ్యయనము చేయటము వలన కర్తవ్య విముఖులైన మానవులు మళ్ళి కర్తవ్యమును చేరుతారు. ఓటమినుంచి గెలుపు వైపుకు నడిపిస్తుంది. భగవద్గీతలో కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగముల సారాంశాలు ఉన్నాయి. భగవంతుని తత్వము ఆత్మస్వారూపము ఇందులో ప్రధానంగా వివరించపడాయి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు"జ్ఞాన షట్కము" అని అంటారు.
1. అర్జునా విషాదయోగము
2. సాంఖ్య యోగము
3. కర్మ యోగము
4. జ్ఞాన యోగము
5. కర్మసన్యాస యోగము
6. ఆత్మసంయమ యోగము
7. జ్ఞానవిజ్ఞాన యోగము
8. అక్షరపరబ్రహ్మ యోగము
9. రాజవిద్యారాజగుహ్య యోగము
10. విభూతి యోగము
11.విశ్వరూప దర్శన యోగము
12. భక్తి యోగము
13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14. గుణత్రయవిభాగ యోగము
15. పురుషోత్తమప్రాప్తి యోగము
16. దైవాసురసంపద్విభాగ యోగము
17. శ్రద్దాత్రయవిభాగ యోగము
18. మోక్షసన్యాస యోగము
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి