శ్రీకృష్ణ

తృణవ్రతుడి వధ 

నందనవనంలో కొన్నిరోజుల తరువాత ఒకరోజు ఆరుబయట యశోద, రోహిణి కృష్ణుడిని కూర్చుబెట్టుకొని ఉన్నారు. కొంతసేపటికి ఉన్నటుండి కృష్ణుడు బరువు పెరిగిపోయాడు. యశోద కృష్ణుడిని మోయలేక కింద కుర్చోపెటింది. నందనవనంలో ఉన్నటుండి సుడిగాలి వచ్చింది. వస్తూనే కృష్ణుడిని తీసుకెళ్లింది. సుడిగాలినుంచి తేరుకొని చూసేసరికి పక్కన కృష్ణుడు లేడు. యశోద ఏడుస్తూ అంత వెతకసాగింది. ఈలోపు సుడిగాలి రూపములో వచ్చిన తృణవ్రతుడు సంతోషపడుతూ ఎవరూ చంపలేక పోయారు  నేను చంపేస్తునాను కృష్ణుడిని అనుకున్నాడు. కృష్ణుడిని ఇంకా పైకి పైకి తీసుకువెళ్ళుతున్నాడు. ఉన్నటుంది కృష్ణుడు మళ్ళి బరువు పెరిగాడు. తృణవ్రతుడు పైకి వేలేవాడు కాస్త కిందకి పడిపోవటం మొదలు పెట్టాడు. కృష్ణుడు తృణవ్రతుడి పీక పట్టుకొని నలిపి సంహరించాడు. తృణవ్రతుడు ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయాడు. రాక్షుసుడి మీద కృష్ణుడు పడి ఆడుకుంటున్నాడు. యశోద ఏడుస్తూ కృష్ణుడిని వెతుకుంటూ వస్తుంది. కృష్ణుడిని తీసుకొని ఇంటికి వెళ్లి ఆవుపేడతోను, గోమాత తోకతోను కృష్ణుడికి అయన 12 నామాలతోనే ఆయనకి దిష్టి తీస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...