శ్రీకృష్ణ

శేకటాసుర సంహారం 

పూతన మరణం తెలుసుకొని కంసుడి కోపం పెరిగిపోతుంది. శేకటాసురుడిని పిలిచి శ్రీ కృష్ణుడిని చంపమని పంపిస్తాడు. ఈ లోపు నందనవనంలో నందుని ఇంట్లో చిన్ని కృష్ణుడు బోర్లాపడతాడు. తల్లి యశోద అదిచూసి నందునితో "స్వామి! నా బిడ పుట్టిన తరువాత మొదటిసారి బోర్లా బడ్డాడు వెంటనే ఉత్సవాలు జరిపించాలి" అని అంటుంది. నందనవనంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి విషయం చెపుతుంది. అక్కడే ఉన్న శేకటాసురుడు ఒక బండి రూపం ధరించి నందుని ఇంటి ముందు ఉన్నాడు. నందుడు దానిని చూసి నిజంగా బండే అనుకోని అందులో పాలకుండలు, పెరుగుకుండలు, నెయ్యికుండలు పెట్టారు. దాని పక్కనే యశోదమ్మ చిన్న మంచం వేసి దానిమీద చిన్ని కృష్ణుడిని పొడుకోబెడుతుంది. అవకాశం కోసం చూస్తునా రాక్షసుడిని కృష్ణుడు చూసాడు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ, ఆడుకుంటూ ఆ బండిని తన కాలితో తన్నాడు. ఆలా తనంగానే బండి గాలిలోకి వెళ్లి పెద్ద  శబ్దంతో ముక్కలై పడిపోతుంది. లోపల ఉన్న నందుడు, యశోద, గోకులవాసులు కంగారుపడతారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...