శ్రీకృష్ణ

శ్రీకృష్ణ జననం 

మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయినా దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం అయినా తరువాత వసుదేవుడిని,దేవకిని తీసుకొని దేవకీ అన్న కంసుడు ఆమెను అత్తవారి ఇంటిలో దిగబెట్టటానికి వెళతాడు. వారిని రథంలో తీసుకొని వెళుతుండగా దారిలో ఆకాశవాణి "కంసా! నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపున్న పుట్టిన ఎనిమిదొవ కుమారుడే" అని చెపుతుంది. అది విన్న కంసుడు కోపంతో రథం మీద నుంచి దిగి దేవకిని రథము మీదనుంచు లాగి ఆమెని చంపబోతాడు. వాసుదేవుడు వెంటనే అడ్డు పడి "ఏమిటి బావ నువ్వు చేస్తున్న పని నీ చెల్లెలిని నువ్వే చంపుతావా నీకు ఇది తగిన పనేనా అయినా నిన్ను చంపేది నీ చెల్లెలి కుమారుడు. నీ చెల్లెలు కాదు. నేను మాట ఇస్తున్నాను. నీ చెల్లెలికి పుట్టిన ప్రతి బిడ్డని నికు తీసుకువచ్చి ఇస్తాను వారిని చంపు నీ చెల్లెలిని వదిలేయి" అంటాడు. అందుకు కంసుడు అంగీకరించి వారిని వారి రాజ్యానికి పంపకుండా కంసుని రాజ్యానికె తీసుకువచ్చి వారిని అంతఃపుర బంధీలుగా చేస్తాడు. కొన్నాళ్లకి దేవకీదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు. వాసుదేవుడు ఇచ్చిన మాటప్రకారం తన కుమారుడిని తీసుకువచ్చి కంసునికి ఇస్తాడు. కంసుడు ఆ బిడ్డ మొఖం చూసి చంపలేక "నన్ను చంపేది ఈబిడ్డ కాదు. మీకు కలిగే ఎనిమిదొవ కుమారుడు. వీడిని నేను  చంపలేను వీడిని సంతోషంగా తీసుకువెళ్ళు" అని అంటాడు. ఇలా కొన్నాళ్లకి వారిని ఆరుగురు కుమారులు జన్మిస్తారు. వారందరిని కంసుడు గారాబంగా చూస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు నారదమహర్షి కంసుని దగరకు వచ్చి నువ్వు గత జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి అని నిన్ను చంపటానికి శ్రీమహావిష్ణువే అవతరించబోతున్నాడని అతను వచ్చేటపుడు అతని సోదరుడిని కూడా వెంటబెట్టుకొని తీసుకువస్తాడు అని ఇపుడు ఉన్న పిల్లలో ఎవరూ తమ సోదరుడికి సహాయం చేస్తారో తెలియదు అని చేపి వెళ్లిపోతాడు. దానికి కోపం తటుకోలేక కంసుడు వాసుదేవుని అంతఃపురానికి వెళ్లి పిల్లలు అందరిని గిరగిరా తీపి నేలకేసికోటి చంపాడు. అడ్డు వచ్చిన దేవకిని వసుదేవుడిని సంకెళ్లతో చెరసాలలో బంధించాడు. ఏమిటి ఈ అన్యాయం అని అడిగిన ఉగ్రసేనుని బందించి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. మళ్ళి నారద మహర్షి వచ్చి కంసునితో అయ్యాయో ఎంతపని చేశావయ్యా ఆ ఆరుగురు గత జన్మలో నీ కుమారులే హిరణ్యకశిపుడు వారందరిని మీరు మీ తండ్రి చేతిలోనే చనిపోతారు అని శాపం ఇస్తాడు. ఆ మాట విన్న కంసుడు చాల బాధపడి ఎనిమిదొవ గర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంత కాలానికి దేవకీదేవి మళ్ళి గర్భం ధరిస్తుంది. కానీ  దేవకీదేవి గర్భంలో ఉన్న పిండిని యోగమాయ వసుదేవుని మొదటిభార్య ఆయన రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది. ఎడొవ గర్భం విచ్చినం అయిందని కంసుడు తెలుసుకొని సంతోషిస్తాడు. ఎనిమిదొవ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...