పాశురము 22
అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే
శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్
కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే
శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;
తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్
అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.
అర్ధం :-
ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు తప్ప వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి