శ్రీకృష్ణ

శ్రీకృష్ణ జననం

యోగ మాయ ద్వారా గర్భం ధరించిన రోహిణికి బలరాముడు పుడతాడు. తరువాత కొన్నాళ్లకి దేవకీదేవి గర్భం ధరిస్తుంది. ఆమె గర్భం ధరించిన దగర నుంచి కంసునికి అన్ని అపశకునాలే కనిపించాయి. రోజు గడుస్తున్నా కొద్దీ కంసుడు భయంతో గడిపాడు. శ్రీమహా విష్ణువు దేవకీగర్బంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు, యక్షులు, కీనేరా, కింపురుషులు స్వామిని సేవించటానికి చెరసాలకు అదృశ్య రూపములో వచ్చేవాళ్లు. ఇలా కొన్నాళ్ళు గడిచినతరువాత దేవకీ దేవికి నిండునెలలు వచ్చాయి. కంసుడు భయంతో చెరసాలలో కూడా వారిని స్వచ్ఛగా తిరగనివ్వకుండా వసుదేవుడిని కదలనివ్వకుండా కళ్ళకి చేతులకి సంకెళ్లు వేసాడు. శ్రావణ శుద్ధ అష్టమి రోజునా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఆయన జన్మించగానే వసుదేవుడు బ్రాహ్మణులకి దానాలు ఇస్తాను అని మనసులోనే సంకల్పం చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధుర నగరంలో అందరూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. పుట్టిన బాలుడు శ్రీమహావిష్ణువు రూపాని పొంది దేవకీదేవి, వసుదేవులకు నమస్కారం చేసి "నేను పుట్టిన ఇదే సమయంలో నందనవనంలో యోగమాయ యశోద గర్భానా జన్మించింది. నా మాయచేత పశుపక్షాదులు తప్ప మానవులందరు గాఢ నిద్రలో ఉన్నారు. కనుక నువ్వు వెళ్లి నందనవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్న యోగమాయను ఇక్కడికి తీసుకొని రా అనిచెపి అదృశ్యము అయిపోయారు. వెంటనే వసుదేవునికి ఉన్న సంకెళ్లు తెగిపడిపోయాయి. చెరసాల తలుపులు అవే తెరుచుకున్నాయి. దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదలకే పంపించింది. చెరసాల నుంచి బయటకు వచ్చి చుస్తే కుండపోతగా వాన కురుస్తుంది. అంత ఆ పరమాత్మయే చూసుకుంటాడు అని వరదల పొంగుతున్న యమునా నదిని దాటుతూ మనసులో శ్రీహరిని తలుస్తున్నాడు. వసుదేవుడు శ్రీకృష్ణుని తన శిరస్సు మీద పెట్టుకొని నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్లక శ్రీకృష్ణుని పాదాలు యమునానదిలో తడవగానే యమునా నది వచ్చింది పరమాత్మ అని తెలుసుకొని రెండు పాయలుగా చీలి ధరిస్తుంది. శ్రీకృష్ణుడు తడుస్తునాడు అని ఆదిశేషుడు పాడగా పట్టాడు. ఇలా వసుదేవుడు యమునానదిని ధాటి నందన వనానికి చేరుతాడు. అక్కడ నందుని ఇంటిలో యశోద దగర శ్రీకృష్ణుని ఉంచు అక్కడ పుట్టిన పాపని తీసుకొని మధుర చెరసాలకు వచ్చాడు. ఆ బిడ్డ ఏడుపు వినపడగానే మాయ తొలగిపోయి అందరికి మెలకువ వచ్చింది. కాపలాదారులు వెంటనే వెళ్లి కంసునికి ఈ విషయం చెపుతారు. కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోబోతే దేవకీదేవి కంసుడి కళ్ళు పట్టుకొని అన్నయ ఈ బిడ్డ కుమారుడు కాదు కూతురు. అడ పిల్ల నిన్ను ఏమిచేస్తుంది. ఈమెను వదిలేయి అని బ్రతిమిలాడుతుంది. అయినా కంసుడు వదలకుండా మిగతాపిల్లలను చంపినాటే ఈ పాపని కూడా నేలకేసి విసురుతాడు. ఆ పాపా నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్లి అదిశక్తీ అవతారం ఎత్తి "కంసా!నిన్ను చంపేవాడు వేరొకచోట పెరుగుతున్నాడు" అని చేపి అదృశ్యమయిపోతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...