శ్రీకృష్ణ

పూతన సంహారం 

యోగమాయ మాయం అవగానే కంసుడు కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కంసుడు వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచి "జరిగినది మీకు తెలుసుకదా నన్ను చంపేవాడు తపించుకొని పోయాడు వాడు బ్రతికివుంటే నేను మరణించటం కాయం ఇప్పుడు కర్తవ్యం ఏమిటి?" అని మంత్రి మండలిని అడిగాడు. "యధా రాజా తధా ప్రజా" ఆనటు అందరూ కలిసి "పుట్టిన పసిపిల్లలను అందరిని చంపేయండి" అని చెప్పారు. వారు ఇచ్చిన సలహా బాగుంది అని కంసుడు సంతోషించి పూతన అనే రాక్షసిని పిలిచి రాజ్యములో ఉన్న పసిపిల్లలందరిని చంపేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. పూతన రాజ్యములో ఉన్న పసిపిల్లలకు తన విషపు పాలను ఇచ్చి చంపేస్తుంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు నందుడు వసుదేవుడిని చూడటానికి చెరసాలకు వస్తాడు. తమకు సంతానం కలిగింది అని చేపి తమ రాజ్యంలో విశేషాలు చెపుతాడు. ఇంతలో వసుదేవుడు నందునితో "నందా! ఎదో అరిష్టం జరుగుతుంది అని నా మనసుకి అనిపిస్తుంది నువ్వు తొందరగా నీ రాజ్యానికి వేళ్ళు" అని నందుడిని పంపించివేస్తాడు. నందుడు వెంటనే బయలుదేరుతాడు. పూతన పసిపిల్లలను చంపుకుంటూవచ్చి శ్రీకృష్ణుడు ఉన్న స్థలానికి వచ్చి వేషం మార్చుకొని శ్రీకృష్ణుడిని చూసి తన మనస్సులో ఈ బాలుడు ఎంత బాగున్నాడు అనుకోని నిద్రపోతున్న కృష్ణుడిని ఎత్తుకొని బయటకు తీసుకువెళ్లి పాలు ఇవ్వబోతుంటే వెనక రోహిణి, యశోద వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా కృష్ణుడుని నిద్రలేపి పాలు ఇచ్చింది. కృష్ణుడు ఆమె పాలను రెండు గుక్కలు తాగిన్నా వెంటనే ఆమె వదులు వదులు అని అరుస్తూ తన నిజరూపాన్ని ధరించి కిందపడి చనిపోతుంది. ఆమె శరీరం 13 కిలో మీటరులు మేర పడుతుంది. యశోద ఆ శరీరం పైన వెతికి కృష్ణుడుని వెతుకుంతుంది. ఈ లోపు నందుడు నందనవనానికి వస్తాడు. దారిలో ఆడాంగా ఉన్న  పూతన శరీరాని గ్రామస్తుల సహాయంతో కాటేపులలు వేసి తగలబెడతారు. దుర్వాసన వస్తుందని ముక్కుకి ఆడంపెట్టుకుంటారు. కానీ చిత్రంగా ఆమె శరీరం నుంచి అగరబత్తుల వాసనవస్తుంది. దానికి కారణం శ్రీకృష్ణుడు పరమాత్మ పూతన కృష్ణుడు తనని తల్లిలా దగ్గరకి తీసుకుంది కాబట్టి ఆమె పాలు తాగుతుండగా మొదటిగుకలో ఆమె పాపాన్నీ రెండొవ గుక్కలో ఆమెకు మోక్షాన్ని ఇస్తాడు స్వామి.......... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...