భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 22

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |

యస్విన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||

అర్ధం :-

బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధిద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపమునుండి ఏ మాత్రమూ విచలితుడు కానేకాదు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 21

సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రహ్యమతీంద్రియమ్ |

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః |

అర్ధం :-

బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మ బుద్ధిధ్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వరూపమునుండి ఏమాత్మమూ విచలితుడు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 20

యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ |

యాత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ||

అర్ధం :-

ధ్యానయోగసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ధ్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో, ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని, యోగి ఆ స్చచిదానందఘనపరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు.  

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 19

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృతా |

యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః ||

అర్ధం :-

వాయుప్రసారములేనిచోట నిశ్చలముగానుండు దీపమువలె, యోగికి వశమైయున్న చిత్తము పరమాత్మధ్యానమున నిమగ్నమైయున్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలముగా నుండును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 18

యదా వినియతం చిత్తమ్ ఆత్మన్యేవావతిష్ఠతే |

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||

అర్ధం :-

చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పినప్పుడు సర్వభోగములయందును స్పృహారహితుడగును. ఆప్పుడతడు యోగయుక్తుడనబడును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 17

యుక్తాహారవిహాస్య యుక్తచేష్టస్య కర్మసు |

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ||

అర్ధం :-

ఆహారవిహారాదులయందును, కర్మాచరణములయందును, జాగ్రత్స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకమగు ధ్యానయోగము సిద్ధించును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 16

నాత్యశ్నతస్తు యోగో స్తి చైకాంతమనశ్నతః |

న చాతిస్వప్నశీలస్యజాగ్రతో నైవచార్జున ||

అర్ధం:-

ఆర్జునా! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడు మేల్కొనియుండువానికిని ఈ యోగసిద్ధికలుగదు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 15

యుంజన్నేవం సదాత్మానం యోగీనియతమానసః |

శాంతిం నిర్వాణపేఅమాం మత్సంస్థామధిగచ్ఛతి ||

అర్ధం :-

మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధాముగా లగ్నమొనర్చి, నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 14

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః|

మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీతమత్పరః ||

అర్ధం :-

ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్యవ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో నిశ్చలుడైయుండవలెను. 


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 13

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలంస్థిరః |

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||

అర్ధం :-

శరీరమును, మెడను, శిరస్సును, నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకును పోనియక తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. 


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 12

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |

ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్దయే ||

అర్ధం :-

ఆ ఆసనముపైకూర్చొని, చిత్తేంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతోఆ అంతఃకరణశుద్ధికై ద్యానయోగమును సాధనచేయవలెను. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 11

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ర్ఛితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||

అర్ధం :-

పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భసనమును, జింకచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి, అంత ఎక్కువగాకాని,తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను.


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 10

యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః |

ఏకాకి యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||

అర్ధం :-

శరీరేంద్రియమనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, భోగసామాగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 9

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |

సాధుష్వసి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే||

అర్ధం :-

సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారి యందును,  ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 8

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః||

అర్ధం :-

పరమాత్మ ప్రప్తినందిన యోగియొక్క అంతఃకరణమునందు జ్ఞనవిజ్ఞనములు నిండియుండును. ఆతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. ఆతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణ లీలలు

ఇంకో గోపకాంత కృష్ణుడు వస్తున్నాడు అని తెలుసుకొని వల్ల ఇంట్లో వెన్న, పాలను ఉట్టి కట్టి పైన పెటింది. ఇంతలో కృష్ణుడు తన స్నేహితులని తీసుకొని ఆ ఇంటికి వస్తాడు. వచ్చి చూసేసరికి కుండ ఉట్టిమీద ఉంటుంది. ఆ కుండని అందుకోవటం కోసం పీటలు, రోళ్ళు వేసిన అందలేదు. అందుకని కృష్ణుడు ఇదిఅంతా ఎందుకు కుండకి కన్నం పెడితే సరిపోతుంది అని కుండకి కన్నం పెడతాడు కుండ కిందనుంచి కారిపోతుంది. కృష్ణుడు తన స్నేహితులతోకలిసి వెన్న, పాలను తాగేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం యశోదమ్మకి గోపకాంత చేపి బాధపడుతుంది. ఇంకో గోపకాంత కృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలని వెన్న కుండను తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి తలుపు వెనకాల దాకుంటుంది. కృష్ణుడు రానేవచ్చాడు. ఎవరో ఈ ఇంట్లోవాలె గుమ్మం దగ్గర పెట్టారు అని తన స్నేహితులని పిలిచి వాళ్లకి పెట్టి తాను తిందామని తీసుకోగానే ఆ గోపకాంత వచ్చి చెయ్యి పట్టుకుంది.  కృష్ణుడు భయపడకుండా చూస్తున్నాడు. ఆ గోపకాంత కృష్ణుడిని "నువ్వు ఎవరూ పిల్లాడా!" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నేను బలరాముని తముడిని" అని చెపుతాడు. దానికి గోపకాంత ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని అడుగుతుంది. దానికి కృష్ణుడు "నువ్వు ఉండవమ్మా! మా దూడ ఒకటి కనపడటం లేదు వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను. నువ్వు అరిస్తే పారిపోతుంది" అన్నాడు. దానికి గోపకాంత ఆశ్చర్యపోతు ఏమిటి దూడ కనిపించటం లేదా వెన్న కుండలో ఉందా అని తెల్లబోయి ఆమె చెయ్యి వదిలేసింది కృష్ణుడు పారిపోయాడు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 7

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ||

అర్ధం :-

శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి, స్వధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానముయందు సచ్చిదానందఘనపరమాత్మ చక్కగా స్థితుడైయుండును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 6

బంధురాత్మాత్మనస్తస్య యెనాత్మైనాత్మనా జితః|

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ||

అర్ధం :-

మనస్సును,ఇంద్రియములను, శరీరమును జయించిన మానవుడు తనకుతానే మిత్రుడు.  అలా జయింపనివాడు తనకుతానే శత్రువు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 5

యుధ్ధరేత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||

అర్ధం :-

మనుజులు ఈ సంసారసాగరము నుండి తమను తామే ఉధ్దరించు కొనవలెను. తమకుతామే ఆధోగతిపాలు కారాదు. ఏలనన, లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 4

యదా హి నేంద్రియార్ధేషు నాకర్మస్వనుజ్జతే |

సర్వసంకల్పసన్న్యాసి యోగరూఢస్తదోచ్యతే ||

అర్ధం :-

ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తుడుగాక, సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 3

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |

యోగారూడస్య తస్యైవ శమః కారణముచ్యతే ||

అర్ధం :-

యోగారూఢుస్థితిపొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తికలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పారాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. 

భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 2

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ది పాండవ |

న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||

అర్ధం :-

అలాగే, కేవలము క్రియలను త్యజించినంతమాత్రమున యోగియుకాడు. ఓ అర్జునా! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. ఏలనన, సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు. 

భగవద్గీత

అథ షష్టో ద్యాయః - ఆత్మసంయమయోగః 

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ 

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |

స సన్న్యాసి చ యోగీ చ ననిరగ్నిర్నచాక్రియః ||

అర్ధం :-

భగవానుడు పలికెను :-

కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. కానీ, కేవలము అగ్నికార్యములను త్యజించినంతమాత్రమున సన్న్యాసియుకాదు. 


భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 29

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి ||

ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసన్న్యసయోగోనామ పంచమోధ్యాయః ||5||

అర్ధం :-

భగవంతుడు యజ్ఞములకును, తపస్సులకును భోక్త. సమస్తలోకములకును, లోకేశ్వరులకును అధిపతి. సమస్తప్రాణులకును ఆత్మీయుడు. అనగా - అవ్యాజాదయాళువు. పరమప్రేమస్వరూపుడి. ఈ భగవత్తత్త్వమును ఎఱిగిన భక్తునకు పరమ శాంతి లభించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 28

యతేంద్రియమనోభుద్దిః మునిర్మోక్షపరాయణః |

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||

అర్ధం :-

ఈ ప్రక్రియల ప్రభవమున మనస్సు, బుద్ది, ఇంద్రియములు సాదకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాదనవలన మొక్షపరాయణుడైన ముని ఇచ్చాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 27

స్పర్శన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రునోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ||

అర్ధం :-

బహ్యవిషయభోగములను చింతనచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉమ్చవలెను. ణాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపానవాయువులను సమస్థితిలో నడుపవలెను. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 26

కామక్రోధావియుక్తానాం యతీనాంయతచేతసామ్ |

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే ధీతాత్మనామ్ ||

అర్ధం :-

కామక్రోధరహితులును, చిత్తవృత్తులనుజయించినవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంతపరబ్రహ్మపరమాత్మయే గోచరించును. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 25

లభంతే బ్రహ్మనిర్వణమ్ ఋషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మనః సర్వభూతరహితే రతాః||

అర్ధం :-

పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్తసంశయములనివృత్తిని సాధించినవారును, సర్వప్రాణులహితమును గోరువారును, నిశ్చలస్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నముచేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిర్వణమును పొందుదురు.

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 24

యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః |

స యోగీ బ్రహ్మనిర్వణమ్ బ్రహ్మభూతోధిగఛ్ఛతి||

అర్ధం :-

ఆంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మయందే రమించు  వాడును, ఆత్మజ్ఞనియైనవాడును అగు సాంఖ్యయోగి, సచ్ఛిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై, బ్రహ్మనిర్వణమును పొందును. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...