భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 40

ఇంద్రియాని మనోవా బుద్దిః అస్యాధిష్ఠానముచ్యతే |

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ||

అర్ధం :-

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేస్తుంది.

కార్తీక పురాణము 19వ రోజు

 చాతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

                ఈ విధంగా  నైమిశారణ్యంలో ఉన్న మహామునులు అందరూ కలిసి  శ్రీహరిని స్తోత్రం చేసిన తర్వాత  జ్ఞానసిద్దుడను మహాయోగి " దీనబంధువా! వేదవైద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని  సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడని  సర్వాంతర్యామి అని,  సర్వేజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవా!  మేము ఈ సంసారా బంధం నుండి బయటపడలేక పోతున్నాము.  మమ్మల్ని రక్షించు. మానవులు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దర్శన భాగ్యం కలుగదు.  నీ భక్తులకు మాత్రమే నీవు  కనిపిస్తావు.  రుషికేశా!  నన్ను కాపాడు" అని మైమరిచి స్తోత్రం చేయగా.  శ్రీహరి చిరునవ్వు నవ్వి  జ్ఞానసిద్ద! ఈ స్తోత్ర వచనములకు నేను సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో". అందుచేత జ్ఞాన సిద్ధుడు శ్రీహరి! నేను సంసారబంధమునుండి విముక్తుడిని కాలేకపోతున్నాను. నా ధ్యాస ఎపుడు నీ పాద పద్మములపై ఉండేటట్లు అనుగ్రహించు. మారేది అక్కరలేదు. అలాగే జ్ఞానసిదుడా! నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను. మరొక వారము కూడా ప్రసాదిస్తాను అడుగు.  ఈ లోకంలో అనేక మంది దురాచారు  బలహీనుని అనేక పాపకార్యములు చేస్తున్నారు. ఇటువంటి వారు పాపాలు పోగొట్టడానికి ఒక వ్రతమును కల్పిస్తున్నాము. ఈ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును. 

       నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రములో శేషశయ్యపై పావళిస్తాను. తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున  నిద్ర లేస్తాను. ఈ మధ్యలో వుండే కాలానికి చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలంలో చేసే వ్రతము నాకు చాలా ఇష్టమైనది. ఈ వ్రతము చేసే వారికి సకల పాపాలు నశిస్తాయి. వారు నా సన్నిధికి వస్తురు.  ఈ వ్రత మహత్యం తెలుసుకొని ఇతరులచేత కూడా ఆచరింప చేసి చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలు పోతాయి. దీని నిమిత్తం ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను,  శ్రావణమాసం దశ మొదలు పెరుగును, భాద్రపద మాసం ప్రసన్నమగును పాలను, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. నా భక్తులను పరీక్షించటానికి నేనెలా శయనిస్తాను.  ఇప్పుడు నీవు పట్టించిన స్తోత్రాన్ని మూడు సంధ్యలలో భక్తితో పటిస్తే నా సన్నిధికి వస్తారు.  అని శ్రీమన్నారాయణుడు మహామునులకు బోధించే శ్రీమహాలక్ష్మి తో సహా పాల సముద్రంలోకి వెళ్లి పవళించారు.

         వశిష్టుడు జనక మహారాజుతో రాజా! ఈవిధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలైన మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యం ఉపదేశించారు. నేను నీకు వివరించాను  ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం ముని పుంగవులు అందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వైకుంఠానికి వెళ్లారు.





భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 39

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |

కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేవ చ ||

అర్ధం :-

ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. అది ఎప్పటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానాన్ని కప్పివేస్తుంది.

కార్తీక పురాణము 18వ రోజు

సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము



          మునిచంద్ర! మీ దర్శనం వలన ధన్యుడనయను. సందేహాలు తీరేలా జ్ఞాన ఉపదేశం చేసారు. నేటి నుంచి నన్ను మీ శిష్యుడిగా స్వకరించండి. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము మీరే. నా పూర్వ జన్మ పుణ్యము వలన మీ సాంగత్యం లభించింది. లేకపోతే మహా పాపాత్ముడునై అడవిలో చెట్టు మోదుగా పడిఉన్న నేను మీ కరుణ వలనే నాకు మళ్లీ మానవ రూపం లభించింది.  నను మీ శిష్యుడిగా స్వీకరించి సత్కర్మలను మానవులు ఎలా అనుసరించాలి. దాని ఫలితము వివరించేంది అని అడిగారు.  

           ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలను ఉపయుగకరమైనవే వివరిస్తాను. శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుతానికై సత్కర్మలు చేయాలి అని సకల శాస్త్రాలు గోషిస్తున్నాయి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలితములు పరమేశ్వరునికి అర్పించిన జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో, అటువంటి కర్మలు తెలుసుకొని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలు ఆచారించిన అవి వ్యర్ధము అవుతాయి. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును. ఈ మూడు మాసములలో తప్పకుండా దగ్గరలో ఉన్న నదిలో ప్రాతఃకాలంలో స్నానము చేయాలి. అలాగా స్నానము అచరించి దేవతార్చన చేసిన తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు, ప్రాతఃకాలమున స్నానమాచరించి సంధ్యావందనము సూర్యనమస్కారాలు చేయాలి. కార్తీక మాసములో అరుణోదయ స్నానమాచరించిన వారికీ చతుర్వేద పురుషార్ధాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసముతో సమానమైన మాసం, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకి సమానమైన తీర్ధములు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేదు అని తెలుసుకో. కార్తీక మాసంలో యధావిధిగా స్నానం ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠానికి వెళతారు.  అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు ఇలా ప్రశ్నించారు. 

       ఓ ముని శ్రేష్టా! చాతుర్మాస వ్రతం అని చెప్పారు కదా? ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము చేయటం వలన ఫలితమేమి? వ్రత విధానం ఎలా చేయాలి? వివరంగా వివరించండి? అని కోరాడు. అంగీరసుడు ఇలా చెప్పసాగారు. 

         ధనలోభా! విను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాడ మాసం శుద్ధ ఏకాదశి రోజునా  పాల సముద్రంలో శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తారు. ఈ నాలుగు మాసాలు చతుర్మాస్యమని పేరు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఉన్నాయి.  ఈ నాలుగు మాసాలు శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జప, తపాలు వంటి సత్కార్యాలు చేస్తే పూర్ణఫలము కలుగుతుంది.  ఈ విషయం శ్రీ మహా విష్ణువు వలన తెలుసుకున్నాను, ఆ విషయాలు నీకు తెలియజేస్తాను.

           తొలి కృతయుగంలో వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత,  సేవించుచుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా  ఆ సమయంలో నారదమహర్షి వచ్చి శ్రీమన్నారాయణ గారికి నమస్కరించి నిలబడి ఉన్నాడు. శ్రీహరి నారదునితో నారద!నీవు క్షేమమే కదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహా మునుల సత్కర్మలు విజ్ఞములు లేకుండా సాగుతున్నాయి. మానవులందరూ వారికి విధించిన ధర్మాలను పాటిస్తున్నారా. ప్రపంచంలో అరిష్టాలు లేకుండా ఉన్నాయి కదా? అని కుశల ప్రశ్నలు అడిగారు. నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! ఈ జన్మలో నీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా. ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియట్లేదు. కొందరు భుజించ కోరండి పదార్థాలు పూజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలను ఆచరిస్తూ అవి పూర్తికాకుండానే మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు సదాచారాలుగా, మరికొందరు అహంకారులుగా, పరనింద చేస్తూ జీవిస్తున్నారు. అట్టి వారిని సంతృప్తి పుణ్యాత్ములను చేసే రక్షించమని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో పాటు గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది ఋషులతో భూలోకానికి వచ్చి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నారు.

           శ్రీమన్నారాయణుడు ముసలి బ్రాహ్మణ రూపంలో సమస్త ప్రాణులను పరీక్షిస్తూ  పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యఆశ్రమాలు తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడు అని ఎగతాళి చేశారు. మరి కొందరు ఈ ముసలి వాని తో మనకేంటి పని ఊరుకున్నారు. కొందరు గర్వంతో ఉన్నారు. మరికొందరు శ్రీహరిని కనీసం కన్నెత్తి అయినా చూడలేదు. ఇది అంత చుసిన శ్రీ మహా విష్ణువు "వీళ్ళందరి ఎలా తరింపచేయాలి" అని ఆలోచిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదలి తన నిజరూపం ధరించి శ్రీ మహాలక్ష్మితో భక్తులతో మునులకు ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లారు.

         ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమానికి శ్రీమన్నారాయణుడు వచ్చినందుకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఇలా స్తోత్రం చేశారు. 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం!

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం!

వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం!

     ఇంకా ఉంది ………………

        

భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 38

ధుమేనావ్రియతే వహ్ని: యథాదర్శో మలేన చ |

యథోల్బేనావృతో గర్భః తథా తేనేదామవృతమ్|

అర్ధం :-

పొగ వలన అగ్ని, ధుము వలన అద్దము, మావిచే గర్భము కప్పి వేయునట్లు, జ్ఞానము కామము వలన కప్పబడి ఉంటుంది. 

కార్తీక పురాణము 17వ రోజు

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వపదేశము 

         ధనలోభి! నీకు కలిగిన సంశయములకు సమాధానం చెపుతాను విను. కర్మవలన ఆత్మ వివిధ శరీరాలను ధరించాల్సి వస్తుంది. కనుక శరీర ధారణకు కర్మ కారణమవుతుంది. శరీరాని ధరించటం వలన ఆత్మ కర్మను చేస్తుంది.  కనుక కర్మ చేయటానికి శరీరమే కారణమవుతుంది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం ఏర్పడుతుంది అని మాత పార్వతికి పరమేశ్వరుడు వివరించెను. దానిని మీకు నేను వివరిస్తాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని ధారణ చేసుకొని వ్యవహరించేది. అని అగిరసుడు చెప్పగా........ 

          ఓ మునిచంధ్రా! నేనింతవరకు ఈ శరీరమే ఆత్మ అని భావిస్తున్నాను. నాకు ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్ధమునకు పాదార్థాజ్ఞానము కారణమవుతుంది. కనుక 'అహంబ్రహ్మ'యను వాక్యార్ధమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరుకున్నాడు. 

         ధనలోభా! ఈ శరీరము అంతఃకరణ వృత్తికి సాక్షి. 'నేను-నాది' అని చెప్పబడే జీవాత్మయే 'అహం' అను శబ్దము. సర్వాంర్యామియై పరమాత్మ 'నః'అను శబ్దము, ఆత్మ ఘటాదుల వాలె శరీరానికి అర్ధములేదు. ఆ ఆత్మ సచిదానందా స్వరూపము, బుద్ధి, సాక్షి జ్ఞానరూపమగు శరీర ఇంద్రియాలు మొదలగు వ్యాపకుమలయందు ప్రసరించేలాచేసి వాటి అన్నిటి కంటే వేరుగా ఉన్నదై ఎల్లపుడు ఒకే రీతిన ప్రకాశిస్తూ ఉండేది ఆత్మ. నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదు అని తెలుసుకో. ఈ ఇంద్రియాలన్నిటిని ఏదీ ప్రకాశించేలా చేస్తుందో అదే 'నేను' అని తెలుసుకో. అందువలన అశాశ్వతమయిన శరీర ఇంద్రియాలు కూడా నామరూపము నశిస్తాయేగాని, ఇటువంటి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటిని "నేను" "నాది" అను వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించు. 



             ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటే  శరీరం, ఇంద్రియాలు కూడా ఆత్మను అంటిపెట్టుకొని తిరుగుతాయి. అలాగే అవి ఆత్మవలన తమ పనిని చేస్తాయి. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢనిద్ర పోయి, నిద్రలేచిన తరువాత నేను సుఖముగా నిద్రపోయాను, సుఖముగా ఉన్నాను అని అనుకొనేదే ఆత్మ. 

         దీపము గాజుబుడ్డిలో ఉంది గాజును ఎలా ప్రకాశించేలా చేస్తుందో అలాగే ఆత్మ కూడా శరీర ఇంద్రయాలను ప్రశించేలాచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమవటం వలన దానికి ధారా పుత్రాదులు ఇష్టమవుతున్నాయి. అటువంటి విశేష ప్రేమస్పందన కలిగి ఉందొ అదే పరమాత్మ అని గ్రహించు. తత్త్వమసి అను పదము జీవాత్మ పరమాత్మ ఐక్యతను బోధిస్తుంది. ఈ విధముగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా పరమాత్మ స్వరూపము ఒకటే నిలుస్తుంది. శరీరము లక్షణములు-ఉండటం-జన్మించటం-పెరగటం-క్షిణించటం-చనిపోవటం మొదలగు ఆరు భాగాలూ శరీరానికే కానీ ఆత్మకు లేవు. పరమాత్మ స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనిని సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే 'ఆత్మ'. ఒక కుండను చూసి ఏ విధముగా మట్టితో చేసింది అనుకుంటామో అదేవిధముగా శరీరములో ఉన్న ఆత్మ పరమాత్మ అని తెలుసుకో. 

          జీవుల కర్మఫలం అనుభావుంచేలా చేసేవాడు పరమేశ్వరుడు, జీవుల కర్మఫల అనుభవిస్తారో తెలుసుకో. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష చేసేవారు సంసార సంబంధములు ఆశలన్నీ విడచి విముక్తి కలుగుతుంది. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతారు. అందువలన సత్కర్మనుస్టనము చేయవలెను. మంచిపనులు చేసిన కానీ ముక్తి లభించదు. అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అన్నాడు. 

     ఇంకాఉంది...……………………

కార్తీక పురాణము 16వ రోజు

దీప స్థంభం ప్రశంస 


ఓ జనకమహారాజా! కార్తీకమాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం.  ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠములో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసం అంత స్త్రీ పురుషులు ఆకాశ దీపముగాని, స్థంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి, వారి జీవితం ఆనందదాయకం అవుతుంది. దీప స్థంబ ప్రాముఖ్యం గురించి ఒక కథ ఉంది చెపుతాను విను.....

దీపస్తంభము మానవుడు అవటం.............. 

ఋషులలో అగ్రగణ్యుడు అయినా మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని, దానికి దగరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేస్తుండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుటుపక్కల ఉన్న మునులు అందరూ స్వామిని పూజించేవారు. ఒకరోజు ఆశ్రమములో మతంగ మహర్షి  అక్కడ ఉన్న మునులతో "ఓ మునీశ్వరులారా! కార్తీకమాసంలో హరిహరుల ప్రీతి కోసం దీపస్థంబము నుంచి వైకుంఠ ప్రాప్తికలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా! కార్తీక పౌర్ణమి కనుక మనం అడవికి వెళ్లి పెచ్చులు, పేళ్ళులులేని ఒక స్తంభాన్ని తీసుకువచ్చి దానిని విష్ణు మందిరము ముందు పాతి ఆవునేయితో దీపాన్ని వెలిగిద్దాము" అన్నారు. అందుకు మునీశ్వరులు సరే అని అడవికి వెళ్లి మునీశ్వరుడు చేపినవిధంగా ఒక స్తంభాన్ని తీసుకువచ్చారు. దానిని విష్ణుమూర్తి మందిరం ముందు పాతి ఆవునెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి దానిని స్తంభము చివర ఆకాశం వైపు ఉంచి పురాణ పాటిస్తున్నారు. ఇంతలో ఆ దీపస్థంభం పెళపెళమని విరిగి అందులోనుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అతనిని చుసిన మునులందరూ ఇలా అడిగారు. "నువ్వు ఎవరు? నువ్వు ఈ దీపస్థంబము నుంచి ఎలా వచ్చావు?" అని అడిగారు. అందుకు ఆ పురుషుడు " మునీశ్వరులారా! నా పేరు ధనలోభుడు. కిందటి జన్మలో ఒక బ్రాహ్మణజమిందారుని. ఐశ్వర్యవంతుడిని అనే గర్వముతో ఎవరిని లెక్కచేయక పాపకార్యములు చేసేవాడిని. న్యాయాన్యాయవిచక్షణ లేకుండా అందరిని దుర్భాషలాడుతూ ఆడవారిని, పిల్లలను హింసిస్తూ సాటి బ్రాహ్మణులను గౌరవించకుండా ఉండేవాడిని. నాకు దానధర్మాలు తెలియవు. మరణించిన తరువాత గోరనరకము అనుభవించి లక్ష జన్మలు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేలజన్మలు పెడపురుగునై, తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమునుండి కూడా నేను పాపములను పోగొట్టుకొనలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవలన స్థంబముగా ఉన్న నేను మానవజన్మ ఎత్తాను. నాకు పూర్వజన్మ జ్ఞానము లభించింది. మునీశ్వరులారా నాకు ముక్తిని పొందే మార్గము ఏదయినా ఉంటె ప్రసాదించండి స్వామి" అని వేడుకున్నాడు. అందుకు ఆ మునీశ్వరులలో ఉన్న అగిరస మహర్షి ఇలా చెప్పసాగారు కార్తీక మహత్యం ఎంతగొప్పది అని చెప్పసాగారు........... 

 ఇంకా ఉంది................









రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...