బోగి పండుగా విశిష్టత

ఈ బోగి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి బోగి మంటలలో ఈ ధనుర్మాసం నెలరోజుల పాటు ముగ్గులతో పెట్టిన గొబెమ్మలను గొబెమ్మ మీద పెట్టిన పూవులతో సహా పిడకలు తాయారు చేసి దందాగా గుచ్చి బోగి మంటలలో చేస్తారు. పేదలు ఎలా చేయటం వలన వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు చనిపోయి చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది అంటారు. పేదలు మనకు అందులో వీటిని అలవాటు చేసారు. సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తయానానికి ప్రయాణం మొదలు పెడతారు. అందుకే బోగి మంటలు వేసి సూర్యునికి స్వాగతం పలుకుతారు. ఈ రోజు అందరూ అబ్యగానా స్నానం(ఒంటికి నువ్వులనూనె రాసుకొని కుంకుడికాయలతో స్నానం) చేస్తారు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ రోజు పరమాన్నం నైవేద్యం చేస్తారు. ఈ రోజు పిండి వంటలు చేస్తారు. పేరంటాలు, బొమ్మల కొలువులు చేస్తారు. ఈ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు బోగి పండ్లు పోస్తారు.ఆ బోగి పండ్లలలో రేగిపండ్లు(సూర్య భగవానుడి ప్రతీకగా చెపుతారు), చెరుకు ముక్కలు, పువ్వులు రూపాయి బిళ్ళలు కలిపి బోగి పండ్లు తాయారు చేస్తారు.


మీకు మీ కుటుంబ సభ్యులకు బోగి పండుగా శుభాకాంక్షలు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...