వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

 వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత



ఒకసారి సనకనానందనాదులు భూలోకం తీర్ధయాత్రలు చెందామని వస్తారు. కొంతకాలం భూలోకంలో తీర్ధయాత్రలు చేసి తిరిగి వైకుంఠానికి వెళ్లరు. శ్రీమహా విష్ణువుని దర్శనం చేసుకొని ఇలా అడిగారు. "స్వామి! మేము భూలోకంలో తీర్ధయాత్రలు చేస్తున్నపుడు భూలోకములో మానవులందరు చాలా భాధలు అనుభవిస్తున్నారు. వారికీ భాదలు తీరే మార్గం చూపించండి" అని కోరుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి " సనకసనందనాదులారా! వైకుంఠానికి నాలుగు ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం నుంచి దేవతల రక్షణకి వెళతాను. పశ్చిమ ద్వారము నుంచి రాక్షసులను వధించటానికి వెళతాను. దక్షిణాయనంలో భూలోకములో ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశినాడు దక్షిణ ద్వారము నుంచి వచ్చి మానవులను రక్షించి మళ్ళి తిరిగి వైకుంఠానికి వెళ్లి యోగ నిద్రలోకి వెళతాను. మళ్ళి తిరిగి వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి మానవులను రక్షిస్తాను. ఆ సమయంలో నేను యోగ శక్తితో ఉంటాను. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముకోటి దేవతలు, ఋషులు వచ్చి నన్ను దర్శించుకుంటారు. వెంకటాచలం, సోనాచలం, సింహాచలం, సహ్యపర్వతం, అహోబిలం, గరుడాద్రి వంటి ముఖ్యమైన నేను వెలసిన క్షేత్రాలలో ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి దర్శనం ఇస్తాను. నన్ను దర్శించుకున్న మానవులకి భాదలు పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. వైకుంఠ ఏకాదశి రోజునే సముద్ర మషాణంలో హాలాహలం పుట్టింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే అమృతం పుట్టింది. సంవత్సరానికి మొత్తం 24  ఏకాదశులు ఉన్నాయి. ఈ ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశ వ్రతం చేసిన వారికీ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి నాకు నా దర్శనానికి నియమాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి నాకు బ్రాహ్మముహూర్తంలో(తెలవారిక ముందే) చల్లని నీటితో తల స్నానం చేసి నా నామస్మరణ చేయాలి. నా దర్శనం అయేంతవరకు ఉపవాసం ఉండాలి. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేక పోయిన ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పండితునికి స్వయంపాకం లేచి ఉపవాసమును విరముంచాలి. ఇలా సంవత్సరంలో ఉన్నా 24 ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికీ శాశ్వత వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది" అని శ్రీ మహా విష్ణుమూర్తి సనక సనందనాదులతో చెప్పారు. ఈ ఏకాదశి వ్రతముల వల్లనే అంబరీషుడు ప్రసిద్ధి చెందారు. పూర్వం రుక్మాంగదుడు అనే మహారాజు ఉండేవారు. అయన పరమవిష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతం క్రమం తప్పకుండా చేసేవారు. ఒకసారి మోహిని అనే ఆవిడా రుక్మగదుడిని నాశనం వచ్చింది. మహారాజ నాకు ఒక వరం ప్రసాదించండి అని అడిగింది. మహరాజ నువ్వు ఏకాదశి ఉపవాసం మానేస్తావా లేక నీ కుమారుడిని చంపేస్తావా అని అడిగింది. అపుడు మహారాజు మోహిని నీకు మాట ఇచ్చాను కాబ్బటి నేను ఏకాదశి వ్రతం మానను కానీ నా కుమారుడిని చంపేస్తాను అని చేపి కత్తి ఎత్తారు. వెంటనే వైకుంఠము నుంచి విమానం వచ్చింది. విష్ణు దూతలు విమానం నుంచి దిగి రుక్మాగదుడిని అతని కుమారుడిని సశరీరంగా వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. భీముడు ఒకసారి బదరి క్షాత్రానికి వెళ్లరు. నరనారాయణులు దర్శనం చేసుకున్నారు. అప్పుడు నరనారాయణులు భూమిడితో నువ్వు వెంటనే కేదారినాధకు వెళ్ళు అని చెప్పారు. భుముడు కేదారినాధ్ వెళ్లేసరికి వైకుంఠ ఏకాదశి వచ్చింది. శివుడిని దర్శనం చేసుకున్నారు. శివుడు భీమునికి దర్శనం ఇచ్చి సరియైన సమయానికి వచ్చావు నువ్వు ఈ రోజు వైకుంఠ ఏకాదశి నువ్వు ఉపవాసం ఉండు అనిచెప్పారు. అప్పుడు భీముడు స్వామి నేను ఆకలికి తట్టుకొనే నాకు ఇతర మార్గం ఏదైనా ఉంటె చెప్పండి అని అడిగారు. అప్పుడు శివుడు భీమా నువ్వు పూర్తిగా ఉండలేక పోతే పాలు,పళ్ళు, ఉప్పుడు తీసుకొని ఉండవచ్చు అని చెప్పారు. భీముడు శివుడు చేపినట్టుగానే తెలవారుజామునే నిద్ర లేచి విష్ణుమూర్తి నామ జపం చేసారు. ఏకాదశి వ్రతం పూర్తయిన వెంటనే బదరినారాయణుడు దర్శనం ఇచ్చారు. నివ్వు తదనంతరం వైకుంఠానికి చేరుకుంటావు అని వరం ఇచ్చారు. భీముడు కేదారినాధ్ లో ఏకాదశి వ్రతం చేస్తే బదరి నారాయణుడు దర్శనం ఇచ్చారు. దీనిని భక్తి శివకేశవులకు బేధం లేదుగాని తెలియచేసారు. ఈ వైకుంఠ ఏకాదశి బంగారం దానం చేసిన వారికీ వెయ్యి రేట్లు ఫలితం వస్తుంది అని చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ హరి నామస్మరణా, గానం, కీర్తనం అంటే చాలా ఇష్టం అందుకే ఈ రోజు భక్తులు శ్రీ మహా విష్ణువు పురాణం వినటం, చదవటం, శ్రీ మహా విష్ణువు పాటలు పాడుకోవటం చేయాలి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...