భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం28,29

అధ్యాయం 1
శ్లోకం 28
కృపయా పరయావిష్టో విషీధన్నిదమబ్రవీత్ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 

శ్లోకం 29
సీదంతి మామ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి | 
వేపథుశ్చ శేరీరే మే రోమహర్షశ్చ జయతే || 

అర్ధం:- 
సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరిని చూచి, కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోకసంతప్తుడై ఇట్లు పలికెను. 

అర్జునుడు పలికెను :- ఓ కృష్ణా ! సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి, నా అవయవములు శిథిలముగుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది. శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...