భగవద్గీత

 అధ్యాయం 5

శ్లోకం 23

శక్నోతిహైన యః సోఢుం ప్రాక్ శరీరవిమోక్షణాత్|

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స  సిఖీ నరః||

అర్ధం :-

ఈ శరీరమును విడువకముందె అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఊద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన యోగి. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 22

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఎవతే |

ఆద్యంతవంతః కౌతేయ న తేషు రమతే బుధః ||

అర్ధం :-

 విషయేంద్రియసంయోగంవలన  ఉత్పన్నములు భోగములనియును  భోగాలలసులకు సుఖములుగా భాసించినను అని నిసందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి. అనగా అనిత్యములు. కావున, ఓ అర్జునా! వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. 

శ్రీకృష్ణ

 శ్రీకృష్ణ లీలలు 

శ్రీకృష్ణుడిని యశోదమ్మ నిద్రపుచ్చుతునపుడు గోకులంలో ఉన్న గొల్లభామలు వచ్చారు. యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకోని బయటకు వచ్చి కూర్చుంది. ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు కూడా వచ్చి అమ్మ ఒడిలో పోసుకుని అమ్మని వచ్చిన వాళ్లని చూస్తుంటాడు. ఇంకా శ్రీకృష్ణుడి మీద ఒక గోపకాంత ఇలా చెప్పసాగింది. బాలింతలకి  పాలులేవు అని పసిపిల్లలకు ఆవుపాలు పడదాము అనుకునేలోపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగరకు దూడలను వదిలేశాడమ్మా(వాళ్ళు దూడలను పాలు తాగనివ్వకుండా వల్ల పిల్లలకి మాత్రమే పాలను తీస్తున్నారు. అయన అందుకే శ్రీకృష్ణుడు ఆలా చేసారు.). వదిలేసింది చూసి మేము కంగారుపడుతుంటే దూరంగా చెట్టుమీద కూర్చొని మమ్మలిని చూసి నవుతున్నాడు యశోదమ్మ. ఇంకో గోపకాంత మా ఇంట్లో పాలను ఎర్రగా కాగబెట్టి వాటిని కుండలలో భద్రం చేసుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి పాలను తాగేసి కుండలను తొక్కుకుంటూ వెళిపోయాడు అని మొరపెట్టుకుంది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 21

బాహ్యస్పర్శేష్వసక్తత్మా విందత్యాత్మనియత్సుఖమ్|

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ||

అర్ధం :-

ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణముగల సాధకుడు, అత్మస్థితధ్యానజనితమైన సాత్త్మాకాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ ద్యానయోగము నందు అభిన్నభావస్థిహుడై అక్షయానందమును అనుభవించును. 

శ్రీకృష్ణ

ఆడుకోవటానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న, నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆకులకి, ఆవులకి రాసేవారు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటిమీద మట్టి పూసుకొని వచ్చేవారు. వస్తూనే అమ్మ ఆకలివేస్తుంది అన్న పెట్టు అనేవారు. మళ్ళి అన్నం తినేటపుడు కథ చెప్పమనేవారు. అన్నం తినతరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది. 

భగవద్గీత

అధ్యాయం 5

శ్లోకం 20

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ |

స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ర్బహ్మణి స్థితః ||

అర్ధం :-

కనుక, వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోనివాడును, స్తిరమైన బుదిగలవాడును, మొహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్ఛిదానందఘనపరబ్రహ్మపరమాత్మ యందు సదా ఏకీభావస్థితి యందుండును. 

శ్రీకృష్ణ

శ్రీకృష్ణడికి యశోదమ్మ నడుముకి ఒకచిన్న గంటకడుతుంది. ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచిపనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూవచ్చి కుండా పగలకొడతాడు. యశోదమ్మకు కోపంవచ్చి కొడదామని వచ్చి కోటలేక ఈసారి మళ్ళి అలరిచేయి నిను కోటేస్తాను అని మందలిస్తుంది. అంతే శ్రీకృష్ణుడికి కోపంవచ్చి ఒక మూలకి వెళ్లి బుంగ మూతి పెట్టుకొని నేను ఆడుకొని, నేను మాట్లాడాను అని అలిగి కూర్చుంటాడు. ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవటం లేదుగాని ఏడుపుమొఖం పెటేస్తే యశోదమ్మ చూసి నవ్వుకొని ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వోలో పొడుకోని పాలు తాగేసి మాలి ఆడుకోవటానికి వెళ్లిపోయారు. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...