భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం31

అధ్యాయం 2

శ్లోకం 31

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |

ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ||

అర్ధం :-

స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన, క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి కర్తవ్యము మరోకటి ఏదియును లేదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం30

అధ్యాయం 2

శ్లోకం 30

దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత |

తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

అర్ధం :-

ఓ అర్జునా ! ప్రతిదేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలుకానిది. కనుక,ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు. 

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం29

అధ్యాయం 2

శ్లోకం 29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |

ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద న చైవ కశ్చిత్ ||

అర్ధం :- 

ఎవరో ఒక మహపురుషుడు మాత్రమే ఈ అత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్మడు దీని తత్త్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరోక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడ కొందరు దీనినిగూర్చి ఏమియు ఎఱుగరు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం28

అధ్యాయం 2

శ్లోకం 28

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |

అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

అర్ధం :-

ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియగోచరములు గావు. మరణానంతరముగూడ అవి అవ్యక్తములే. ఈ జననమరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ర్పయోజనము.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం27

అధ్యాయం 2

శ్లోకం 27

జాతస్య హి ద్రువో మృత్యు: ద్రువం జన్మ మృతస్య చ |

తస్మాదపరిహార్యే ర్థే న త్వం శోచితుమర్హసి ||

అర్ధం :-

పుట్టినవానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక, అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం26

అధ్యాయం 2

శ్లోకం 26

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |

తథాసి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి ||

అర్ధం :-

కనుక ఓ అర్జునా! నీవు దీనికై శోకింపదగదు. ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.

భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం25

అధ్యాయం 2

శ్లోకం 25

అవ్యక్తో యమచింత్యో యమ్ అవికార్యో యముచ్యతే |

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

అర్ధం :-

ఈ అత్మ అవ్యక్తమైనది. అచింత్యము వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలిసికొనుము.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...