అధ్యాయం 2
శ్లోకం 28
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
అర్ధం :-
ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకుముందు ఇంద్రియగోచరములు గావు. మరణానంతరముగూడ అవి అవ్యక్తములే. ఈ జననమరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ర్పయోజనము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి